సవాళ్లకు పంచ్
జీవనం సాగించేందుకు నిత్యం పోరాటం చేసే కుటుంబం అతనిది. శరీరానికి శక్తిని అందించే సమతుల ఆహారానికి అతనెంతో దూరం...
బాక్సింగ్లో మెరుస్తున్న దీపక్ కుమార్
జీవనం సాగించేందుకు నిత్యం పోరాటం చేసే కుటుంబం అతనిది. శరీరానికి శక్తిని అందించే సమతుల ఆహారానికి అతనెంతో దూరం.. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుర్రాడు బాక్సింగ్ను వదిలిపెట్టి తన కుటుంబానికి సాయంగా ఉండాలనుకున్నాడు. తనకెంతో ఇష్టమైన ఆటకు దూరంగా బతుకు ప్రయాణం సాగిద్దామనుకున్నాడు. ఒకవేళ అదే జరిగి ఉంటే.. మనం ఇప్పుడు ఇలా అతని గురించి చెప్పుకునేవాళ్లం కాదు. కోచ్ సహకారంతో బాక్సింగ్లోనే కొనసాగి.. ఉత్తమ బాక్సర్గా ఎదిగే దిశగా అతనిప్పుడు సాగుతున్నాడు. తాజాగా బల్గేరియాలో జరిగిన స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్, 2016 రియో ఒలింపిక్స్ స్వర్ణ విజేత జోరోవ్ (ఉజ్బెకిస్థాన్)ను చిత్తు చేసి సంచలన విజయం సాధించాడు. అతనే.. 23 ఏళ్ల దీపక్ కుమార్ భోరియా. జీవితంలోని సవాళ్లకు పంచ్ విసురుతూ సాగుతున్నాడీ హరియాణా బాక్సర్.
ఈనాడు క్రీడావిభాగం
పేద కుటుంబం.. కెరీర్ ఆరంభంలోనే గాయం.. తొలి సీనియర్ జాతీయ ఛాంపియన్షిప్ మొదటి బౌట్లోనే నాకౌట్ ఓటమి.. ఇలా ఎన్నో అడ్డంకులు తనను వెనక్కి లాగాలని ప్రయత్నించినా దీపక్ పట్టు వదల్లేదు. రింగ్ దాటి బయటకు రాలేదు. సవాళ్లు ఎదురైనా ప్రతి సారి అత్యుత్తమ రీతిలో స్పందించాడు. కష్టాలను దాటి కలల దారిలో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. పదకొండేళ్ల వయసులోనే అతనికి బాక్సింగ్పై ప్రేమ కలిగింది. చేతులకు గ్లోవ్స్ వేసుకుని.. ప్రత్యర్థిపై పిడిగుద్దులు కురిపించాలనే కోరిక ఏర్పడింది. కానీ తన ఆర్థిక పరిస్థితి అడ్డుగా మారింది. అయినప్పటికీ కోచ్ షెరోన్ కారణంగా అప్పుడప్పుడూ బాక్సింగ్లో సాధన చేసే వీలు కలిగింది. కానీ 15 ఏళ్లు వచ్చేసరికి.. సరైన పోషకాహారం లేకపోవడంతో ప్రాక్టీస్ చేయడం కష్టమైంది. నొప్పులతో శరీరం బాక్సింగ్ శిక్షణకు సహకరించలేదు. దీంతో ఆటను వదిలేసి కుటుంబానికి అండగా నిలుద్దామనుకున్నాడు. కానీ అతనిలోని బాక్సింగ్ ప్రతిభను గుర్తించిన షెరోన్.. తనను వదల్లేదు. స్నేహితుల సాయంతో డబ్బు సమకూర్చి మంచి ఆహారం అందేలా చూశాడు. రుణం తీసుకుని మరీ తన శిక్షణ కొనసాగేలా చూశాడు. కోచ్ నమ్మకాన్ని వమ్ము చేయని దీపక్ అంచెలంచెలుగా ఎదిగాడు.
సహజంగానే..: మొదట్లో బాక్సింగ్ అంటే ఏమిటో కూడా తెలియని దీపక్ ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నాడు అంటే.. అందుకు అతని తపన, పట్టుదల, సహజ సిద్ధంగా అబ్బిన ప్రతిభ ముఖ్య కారణాలు. రింగ్లో వేగంగా కదలడం, ప్రత్యర్థిని దెబ్బకొట్టడం, తొందరగా స్పందించడం లాంటి నైపుణ్యాలు తనకు సహజంగానే వచ్చాయి. అందుకే చిన్నప్పటి నుంచే ప్రత్యేకంగా నిలిచాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ సాగుతున్న అతని ప్రయాణంలో.. 2011లో తన కెరీర్నే ప్రమాదంలో పెట్టే గాయం ఎదురైంది. పట్టుదలతో దాని నుంచి బయటపడ్డ అతనికి.. తన తొలి సీనియర్ జాతీయ బాక్సింగ్ (2017లో విశాఖపట్నంలో) ఛాంపియన్షిప్ తొలిరౌండ్లోనే నాకౌట్ ఓటమి పలకరించింది. అయినా అతను కుంగిపోలేదు. మరింత శ్రమించి ఆటను మెరుగుపర్చుకున్నాడు. మానసికంగా బలంగా సిద్ధమయ్యాడు. అదే ఏడాది అగ్రశ్రేణి బాక్సర్ అమిత్ పంగాల్పై విజయం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అదే జోరుతో 2018లో జాతీయ ఛాంపియన్గా నిలిచాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ నిలకడ ప్రదర్శిస్తున్నాడు. ఆసియా ఛాంపియన్షిప్లో రజతం, థాయ్లాండ్ ఓపెన్, మక్రాన్ కప్, ప్రపంచ మిలిటరీ క్రీడల్లో పతకాలు సాధించాడు. ప్రస్తుతం భారత సైన్యంలో సుబేదార్గా ఉన్న అతను తాజాగా స్ట్రాంజా బాక్సింగ్ టోర్నీ పురుషుల 52 కేజీల విభాగం సెమీస్లో ఇప్పటివరకూ తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనతో జోరోవ్పై అద్భుత విజయం సాధించాడు. ఆ తర్వాత హోరాహోరీ ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్నప్పటికీ టోర్నీలో అతను చూపించిన తెగువ అందరి మన్ననలు అందుకుంది. ఇదే జోరుతో ఒలింపిక్స్లో భారత్కు పతకం అందించాలనే లక్ష్యం వైపు దీపక్ సాగుతున్నాడు.
గడిచిన కొన్ని రోజుల్లో కల నిజమైనట్లుగా అనిపించింది. ప్రపంచంలోని కఠినమైన బాక్సింగ్ టోర్నీల్లో ఒకటైన స్ట్రాంజా స్మారక పోటీల్లో ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జోరోవ్ను ఓడించడం.. ఆ తర్వాత రజతం సొంతం చేసుకోవడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించా. కానీ బాక్సింగ్ నాకు అన్నీ ఇచ్చింది. ఇకపై స్వర్ణాలు గెలవడంపైనే నా దృష్టి. శ్రమ, అంకితభావంతో ఏదైనా సాధ్యమే అనే ఆత్మవిశ్వాసం నాకుంది. - దీపక్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు