CWG 2022: బాక్సర్ల పసిడి పంచ్‌.. అమిత్‌ పంగల్‌, నితూ గంఘాస్‌కు స్వర్ణాలు

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత బాక్సర్ల పంచ్‌లు పతకాలు తెచ్చిపెడుతున్నాయి. పురుషుల ఫ్లైవెయిట్‌లో అమిత్‌ పంగల్‌, మహిళల మినిమమ్‌ వెయిట్‌లో నితూ గంఘాస్‌లు బంగారు పతకాలు సాధించారు......

Updated : 07 Aug 2022 16:25 IST

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత బాక్సర్ల పంచ్‌లు పతకాలు తెచ్చిపెడుతున్నాయి. పురుషుల ఫ్లైవెయిట్‌లో అమిత్‌ పంగల్‌, మహిళల మినిమమ్‌ వెయిట్‌లో నితూ గంఘాస్‌లు బంగారు పతకాలు సాధించారు. ప్రత్యర్థి ఇంగ్లీష్‌ బాక్సర్‌ కియరన్‌ మెక్‌డొనాల్డ్‌పై అమిత్‌ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. మొదటి రౌండ్‌లో 5-0,రెండో రౌండ్‌లో 4-1 తేడాలో గెలుపొందాడు. నితూ సైతం ఇంగ్లాండ్‌కే చెందిన ప్రత్యర్థి జేడ్‌ రెస్థన్‌పై పంచుల వర్షం కురిపించింది. మొదటి రౌండ్‌ను 4-1 తేడాతో, రెండో రౌండ్‌లోనూ 4-1తేడాతో విజయం సాధించి స్వర్ణాన్ని చేజిక్కించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని