Pele: సాకర్ దిగ్గజం పీలే కన్నుమూత
ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాళ్లలో ఒకడైన పీలే ఇకలేడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ దిగ్గజ ఆటగాడు గురువారం మరణించాడు.
క్యాన్సర్తో పోరాడుతూ మృతి
మూడు ప్రపంచకప్ విజయాల్లో భాగస్వామ్యం
సావోపాలో
ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాళ్లలో ఒకడైన పీలే ఇకలేడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ దిగ్గజ ఆటగాడు గురువారం మరణించాడు. సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆసుపత్రిలో కన్నుమూశాడు. బ్రెజిల్కు చెందిన పీలే వయసు 82 ఏళ్లు. ఆయన గత ఏడాది క్యాన్సర్ బారిన పడ్డాడు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటుండగా.. ఇటీవల ఆరోగ్యం విషమించి వివిధ అవయవాలు పని చేయడం మానేశాయి. కొన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడిన పీలే.. కుటుంబ సభ్యుల సమక్షంలో గురువారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచాడు. ఫుట్బాల్లో మూడు ప్రపంచకప్ విజయాల్లో భాగస్వామి అయిన ఏకైక ఆటగాడు పీలేనే. మంత్రముగ్ధమైన తన ఆటతో రెండు దశాబ్దాల పాటు సాకర్ ప్రేమికులను ఉర్రూతలూగించిన పీలే.. తన తరంలోనే కాక మొత్తంగా ఫుట్బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు.
ఆటతో అద్భుతం..
అంతర్జాతీయ ఫుట్బాల్లో పీలే ఆట అద్భుతం. అతని ప్రదర్శన బ్రెజిల్కు వరం. నాలుగు ప్రపంచకప్ల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించాడు. 1958, 1962, 1970 ప్రపంచకప్లు అందుకున్నాడు. ఫార్వర్డ్గా, అటాకింగ్ మిడ్ఫీల్డర్గా మైదానంలో అతని విన్యాసాలు అసాధారణం. మెరుపు వేగంతో బంతిని గోల్పోస్టులోకి నెట్టడంలో అతనికి అతనే సాటి. ఏదో శక్తి మైదానంలో పరుగెడుతున్నట్లుగా.. విద్యుత్కు రూపం ఇస్తే అతనిలాగే ఉంటుందన్నట్లుగా దూసుకెళ్లేవాడు. రెండు కాళ్లతోనూ బంతిని నియంత్రించే అతను.. ప్రత్యర్థి వ్యూహాలను పసిగట్టడంలో దిట్ట. ఎదురుగా ఎంతమంది ప్రత్యర్థి ఆటగాళ్లు ఉన్నా బంతిని డ్రిబ్లింగ్ చేయడంలో అతని శైలే వేరు. గాల్లో వేగంగా వచ్చే బంతిని ఛాతీతో నియంత్రించి.. అది కిందపడి పైకి లేవగానే కాలుతో సూటిగా తన్ని గోల్పోస్టులోకి పంపించడంలో అతని ప్రత్యేకతే వేరు. గోల్కీపర్ అక్కడే ఉన్నా.. ఎంతగా ప్రయత్నించినా బంతిని ఆపడం మాత్రం అసాధ్యంగా ఉండేది. కనురెప్ప పాటులో బంతి నెట్ను ముద్దాడేది. ఈ తరం అభిమానులకు పీలే ఆట గురించి అంతగా తెలిసి ఉండదు. కానీ యూట్యూబ్లోకి వెళ్లి ‘పీలే టాప్ 5 గోల్స్’ అని కొడితే ఫిఫా అధికారిక ఛానెల్లో వీడియో ఉంటుంది. అందులో కేవలం ప్రపంచకప్ల్లోని అతని ఉత్తమ అయిదు గోల్స్ దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. కానీ అవి చూసినా అతని మాయ అర్థమవుతోంది. 1970 ప్రపంచకప్లో రొమేనియాతో పోరులో దాదాపు 25 గజాల దూరం నుంచి ఫ్రీకిక్ను.. డిఫెండర్ల మధ్యలో నుంచి గోల్పోస్టులోకి అతను పంపించిన తీరు అమోఘం. 1958 ప్రపంచకప్ ఫైనల్లో స్వీడన్పై పెనాల్టీ ప్రదేశంలో సహచర ఆటగాడి నుంచి బంతి అందుకున్న అతను.. ఇద్దరు ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పించి, గోల్కీపర్ను బోల్తా కొట్టించిన వైనం అసాధారణం. గోల్కీపర్ డైవ్ చేసినా ఆ బంతిని ఆపలేకపోయాడు. ఇలాంటి గోల్స్ మరెన్నో. ప్రపంచ ఫుట్బాల్లో తిరుగులేని శక్తిగా బ్రెజిల్ ఓ వెలుగు వెలిగిందంటే అందుకు ప్రధాన కారణం పీలే. 1958 ప్రపంచకప్లో మోకాలి గాయాన్ని సైతం లెక్కచేయకుండా రాణించి ఉత్తమ యువ ఆటగాడి అవార్డు అందుకున్నాడు. 1962, 1966 ప్రపంచకప్లో గాయం కారణంగా ప్రభావం చూపలేకపోయాడు. 1966లో జట్టు నిరాశాజనక ప్రదర్శనతో అతను ఆటకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. కానీ మళ్లీ జట్టులోకి వచ్చి 1970 ప్రపంచకప్లో ఉత్తమ ఆటగాడిగా బంగారు బంతి సొంతం చేసుకున్నాడు. 1971 జులైలో యుగోస్లేవియాతో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ప్రపంచకప్ల్లో 14 మ్యాచ్ల్లో 12 గోల్స్ సాధించాడు.
పుట్టిన రోజు: అక్టోబర్ 23, 1940
పుట్టిన ప్రదేశం: ట్రెస్ కొరాకోస్, బ్రెజిల్
అసలు పేరు: ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమియాంటో
తల్లిదండ్రులు: సెలెస్టె అరాంట్స్, జోవో రామోస్ నాసిమియాంటో
పెళ్లిల్లు: రోజ్మెరి (1966-1978), అసిరియా లెమోస్ (1994-2010), మార్సియా (2016 నుంచి)
పిల్లలు: కెలీ, ఎడ్సన్, జెన్నిఫర్, సాండ్రా (చనిపోయారు), ఫ్లావియా, జోషువా, సెలెస్టె
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM