Pele: ఫుట్బాల్ అత్యుత్తుమ ఆటగాడు.. సాకర్ దిగ్గజం పీలే కన్నుమూత
సాకర్ దిగ్గజం, బ్రెజిల్కు మూడు సార్లు ప్రపంచకప్ అందించిన పీలే(82) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
ఇంటర్నెట్ డెస్క్: బ్రెజిల్ దిగ్గజం, ఫుట్బాల్ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరైన పీలే(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న పీలే సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కూతురు ధ్రువీకరించారు. క్యాన్సర్ బారిన పడ్డ పీలేకు గతేడాది సెప్టెంబర్లో వైద్యులు పెద్ద పేగులో క్యాన్సర్ కణితిని తొలగించారు. అప్పటి నుంచి ఆయనకు కీమోథెరపీ చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ క్రమంలో పలు అవయవాలు పనిచేయకపోవడంతో పీలే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. పీలే కన్నుమూయడంతో దేశాధినేతలు, క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు.
అత్యుత్తుమ ఆటగాడిగా పేరు..
1940 అక్టోబర్ 24న జన్మించిన పీలే తన మంత్ర ముగ్ధమైన ఆటతీరుతో సాకర్ చరిత్రలో ఓ దిగ్గజ ఆటగాడిగా వెలుగొందాడు. 1958, 1962, 1970 ప్రపంచకప్లలో బ్రెజిల్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పీలే.. సుమారు రెండు దశాబ్దాలపాటు ఎన్నో ఘనతలు అందుకున్నాడు. మూడు ప్రపంచకప్లు అందుకున్న ఏకైక వ్యక్తిగా పీలే నిలిచాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్బాల్ ఫార్వర్డ్ క్రీడాకారుడిగా పేరు లిఖించుకున్న పీలే.. 16 ఏళ్ల ప్రాయంలోనే బ్రెజిల్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 92 మ్యాచ్ల్లో 77 గోల్స్ చేసి జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన వ్యక్తిగా నిలిచాడు. 1956 నుంచి 1974 వరకు బ్రెజిలియన్ క్లబ్ శాంటోస్ తరఫున బరిలోకి దిగిన పీలే 659 మ్యాచ్ల్లో 643 గోల్స్ చేశాడు. 1961, 1962, 1963, 1964, 1965, 1968లో ఆరుసార్లు తన క్లబ్కు బ్రెజిల్ లీగ్ టైటిల్ను అందించాడు. ఇక తన కెరీర్ చరమాంకంలో న్యూయార్స్ కాస్మోస్ తరఫున రెండేళ్లు యూఎస్లో ఫుట్బాల్ ఆడాడు. మరో దిగ్గజ ఆటగాడు, అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనాతో కలిపి ‘ప్లేయర్ ఆఫ్ ది సెంచరీ’ అవార్డును పీలే అందుకున్నాడు.
చివరిసారిగా సందేశం..
గత నెలలో తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో పీలే ఆసుపత్రిలో చేరాడు. అక్కడి నుంచి చివరిసారిగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ‘‘మిత్రులారా.. నెలవారి చెకప్లో భాగంగా ఆసుపత్రికి వచ్చాను. ఇలా మీ నుంచి నాకు పాజిటివ్ సందేశాలు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఖతార్, నాకు సందేశాలు పంపుతున్న వారందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు