IPL 2022: శుభ్మన్ గిల్ సేవలను కోల్పోవడం విచారకరం
రాబోయే ఐపీఎల్ మెగా ఈవెంట్లో శుభ్మన్గిల్ లాంటి ప్రతిభావంతుడి సేవలు కోల్పోవడం విచారకరమని కోల్కతా నైట్ రైడర్స్ కోచ్ బ్రెండన్ మెక్కలమ్ అన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: రాబోయే ఐపీఎల్ మెగా ఈవెంట్లో శుభ్మన్గిల్ లాంటి ప్రతిభావంతుడి సేవలు కోల్పోవడం విచారకరమని కోల్కతా నైట్ రైడర్స్ కోచ్ బ్రెండన్ మెక్కలమ్ అన్నాడు. ఐపీఎల్ 2022లో పది జట్లతో మెగా టోర్నీ మరింత భారీగా జరగనున్న నేపథ్యంలో ఈసారి ఫ్రాంఛైజీలన్నీ తమ ఆటగాళ్లను (నలుగురు మినహా) వదులు కోవాల్సివచ్చింది. ఈ క్రమంలో కోల్కతా.. రసెల్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తిలను అట్టిపెట్టుకుని.. కొన్నాళ్లుగా తమకు ఓపెనింగ్ అందించిన శుభ్మన్గిల్ను వదిలేసింది. తాజాగా రాబోయే సీజన్లో తమ జట్టు ప్రణాళికలపై స్పందిస్తూ.. గిల్ సేవలను కోల్పోవడం బాధగా ఉందని మెక్కలమ్ పేర్కొన్నాడు.
‘రాబోయే సీజన్ కోసం చాలా మంది ఆటగాళ్లను కోల్పోవాల్సి రావడంతో అందుకు తగ్గ ఆటగాళ్లను తీసుకోవాలంటే సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. గిల్ మా జట్టు తరఫున మంచి ప్రదర్శన చేశాడు. అతడిని కోల్పోవడం నిరాశ కలిగించింది. కానీ, కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. అయితే, మరికొద్ది రోజుల్లో జరగబోయే మెగా వేలంలో మంచి జట్టును ఎంపిక చేసుకోవాల్సి ఉంది. అందుకు తగ్గట్టే ప్రణాళికలు రూపొందించి రెడీగా ఉంటాం. ఇకపోతే నరైన్, రసెల్ లాంటి ఆటగాళ్లు మా జట్టుకు దశాబ్దకాలంగా సేవలందిస్తున్నారు. అలాగే వరుణ్, వెంకటేశ్ ఇటీవల ఎలాంటి ప్రదర్శన చేశారో మనం చూశాం. అందుకే వారిని అట్టిపెట్టుకున్నాం’ అని బ్రెండన్ చెప్పుకొచ్చాడు. కాగా, రసెల్పై ప్రత్యేకంగా మాట్లాడిన కోల్కతా కోచ్.. ఈ విండీస్ ఆల్రౌండర్ అత్యుత్తమ ఫామ్లో ఉంటే.. అతడిలో ఒకేసారి ఇద్దరు ప్రపంచశ్రేణి ఆటగాళ్లను చూడొచ్చని కొనియాడాడు. అతడిని రీప్లేస్ చేసే ఆటగాడు దొరకడం కష్టమని అభిప్రాయపడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్