Arshdeep Singh: బౌలర్కి ‘నో బాల్’ ప్రధాన శత్రువు.. అర్ష్దీప్కి ఆ వేళ కలిసిరాలేదు: బ్రెట్ లీ
శ్రీలంకతో టీ20 సిరీస్ సందర్భంగా (IND vs SL) యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh) ఒకే మ్యాచ్లో ఐదు నో బాల్స్ వేసి తీవ్ర విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. అయితే గాయం నుంచి కోలుకుని వచ్చిన బౌలర్ ఇలా చేయడం సహజమేనని, తప్పకుండా అర్ష్దీప్ మెరుగవుతాడని బ్రెట్లీ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్ ఒకే మ్యాచ్లో ఐదు నో బాల్స్ వేసి తీవ్ర విమర్శలపాలైన విషయం తెలిసిందే. అయితే.. గత ఆసియా కప్, టీ20 ప్రపంచకప్లో నాణ్యమైన పేస్తో భారత్ తరఫున కీలక బౌలర్గా మారాడు. శ్రీలంకతో టీ20 సిరీస్కు ఎంపిక చేసినప్పటికీ.. తొలి మ్యాచ్ నాటికి అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత రెండో టీ20కి వచ్చాడు. కానీ కేవలం రెండు ఓవర్లలో 37 పరుగులు సమర్పించాడు. అర్ష్దీప్ సింగ్ను సరైన సన్నద్ధత లేకుండానే తుది జట్టులోకి తీసుకొన్నారని మేనేజ్మెంట్పైనా కామెంట్లు వచ్చాయి. అయితే కీలకమైన మూడో మ్యాచ్లో మాత్రం మళ్లీ పుంజుకొని కీలకమైన మూడు వికెట్లు తీసి భారత్ సిరీస్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో రెండో టీ20లో అర్ష్దీప్ బౌలింగ్పై తాజాగా బ్రెట్ లీ స్పందించాడు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘కొన్ని రోజుల కిందట శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్లో టీమ్ఇండియా బౌలర్ అర్ష్దీప్ బౌలింగ్ చూశా. తన బౌలింగ్ లయను పూర్తిగా కోల్పోయాడు. ఒకదాని తర్వాత మరొకటి.. ఇలా ఐదు నో బాల్స్ వేశాడు. ఇది అతడికి మింగుడుపడని విషయం. కేవలం రెండు ఓవర్లలో 37 పరుగులు ఇచ్చాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా మూడు సార్లు క్రీజ్ను దాటి ముందుకు అడుగు వేశాడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన తర్వాత రిథమ్ను కోల్పోవడం సహజం. పరిగెత్తే విధానం, పాదాల కదలికను కోల్పోతారు. ఇలాంటి సమయంలో వికెట్లను తీయాలనే కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టడం కష్టంగా మారుతుంది’’
‘‘నో బాల్ అనేది బౌలర్కు ప్రధాన శత్రువు. భారీ మూల్యం చెల్లించుకుంటే మాత్రం మానసికంగా తీవ్ర అసహనానికి గురి కావాల్సి ఉంటుంది. అదనంగా బంతిని విసిరి.. బ్యాటర్ మరింత స్వేచ్ఛగా ఆడేందుకు అనుమతి ఇచ్చినట్లు అవుతుంది. అయితే అర్ష్దీప్ తప్పకుండా బలంగా తిరిగి వస్తాడు. కానీ, ట్రైనింగ్ తీసుకొనేటప్పుడు.. పాత పొరపాట్లను వదిలేయాలి. అప్పుడేం చేశామనేది గుర్తెరిగి తప్పుల నుంచి గుణపాఠాలను నేర్చుకోవాలి. ఇదే నేనిచ్చే సలహా. మళ్లీ అర్ష్దీప్ అదరగొడతాడని ఆశిస్తున్నా’’ అని బ్రెట్ లీ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్