Olympics: 2032 ఒలింపిక్స్ ఎక్కడో తెలుసా?
2032లో నిర్వహించబోయే ఒలింపిక్స్కు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వేదికను ఖరారు చేసింది.......
ఇంటర్నెట్ డెస్క్: 2032లో నిర్వహించబోయే ఒలింపిక్స్కు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వేదికను ఖరారు చేసింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో 35వ ప్రపంచ క్రీడా సంబరాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. దీంతో 32 ఏళ్ల తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా అంతర్జాతీయ ఒలింపిక్స్కు ఆతిథ్యమిస్తున్న దేశంగా నిలుస్తుంది. సిడ్నీలో 2000లో ఒలింపిక్స్ జరగ్గా.. అంతకముందు 1956లో మెల్బోర్న్ వేదికగానూ ఈ అంతర్జాతీయ క్రీడలు జరిగాయి. 2032 ఒలింపిక్స్ అనంతరం పారాలింపిక్స్ కూడా అక్కడే జరగనున్నాయి. బ్రిస్బేన్ నగరంలో ఒలింపిక్స్ నిర్వహణపై ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 80 ఓటింగ్ కార్డులను పంపిణీ చేయగా.. 77 ఓట్లు చెల్లాయి. 72 ఓట్లు అనుకూలంగా రాగా.. వ్యతిరేకంగా 5 ఓట్లు మాత్రమే వచ్చినట్టు ఐఓసీ మీడియా ట్విటర్లో పేర్కొంది.
తమ దేశంలో క్రీడలను విజయవంతం చేసేందుకు ఏమేం అవసరమో తెలుసని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరీసన్ అన్నారు. ఇది బ్రిస్బేన్, క్వీన్స్లాండ్కే కాదు.. యావత్ దేశానికే చరిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఐఓసీ ఓటింగ్ సెషన్లో తన కార్యాలయం నుంచి వర్చువల్గా మాట్లాడారు. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ క్రీడా సంబరానికి 2024లో ప్యారిస్ ఆతిథ్యం ఇస్తుండగా.. 2028లో లాస్ ఏంజెల్స్లో ఒలింపిక్స్ జరగనున్నట్టు ఐఓసీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ నెల 23 నుంచి ఆగస్టు 8వరకు జరిగే టోక్యో ఒలింపిక్స్ సందడి ఇప్పటికే మొదలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ