పర్యవేక్షణలో బుమ్రా.. మైదానంలోకి బెస్ట్ 11
టీమ్ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయాన్ని వైద్యబృందం పర్యవేక్షిస్తోందని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ అన్నాడు. గాయపడ్డ ఆటగాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో తుది జట్టులో భారీ మార్పులు ఉంటాయని పరోక్షంగా సూచించాడు. ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టుకు ముందు ఆయన మీడియాతో...
బ్రిస్బేన్: టీమ్ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయాన్ని వైద్యబృందం పర్యవేక్షిస్తోందని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ తెలిపాడు. గాయపడ్డ ఆటగాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో తుది జట్టులో భారీ మార్పులు ఉంటాయని పరోక్షంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టుకు ముందు ఆయన మీడియాతో మాట్లాడాడు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. మూడో టెస్టు డ్రా కావడంతో నాలుగో టెస్టులో విజయం సాధించాలని భారత్, ఆసీస్ పట్టుదలగా ఉన్నాయి. అయితే భారత్ను గాయాల బెడద వేధిస్తుండటం గమనార్హం. కీలకమైన గబ్బా పోరులో జస్ప్రీత్ బుమ్రా ఉంటే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు. ఒకవేళ అతడు సగం ఫిట్నెస్తో ఉన్నప్పటికీ ఫిబ్రవరిలో స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగే టెస్టు సిరీసును దృష్టిలో పెట్టుకొని ఆడించకపోవచ్చని తెలుస్తోంది.
‘గాయపడ్డ ఆటగాళ్లను పర్యవేక్షిస్తున్నాం. మా వైద్యబృందం ఆటగాళ్లను పరీక్షిస్తోంది. అయితే పరిస్థితుల గురించి ఇప్పుడే చెప్పలేను. ఆటగాళ్లకు కావాల్సినంత సమయం ఇస్తాం. చివరి టెస్టులో ఎవరెవరు ఆడతారో శుక్రవారం ఉదయం తెలుస్తుంది. గాయాలైనా కాకున్నా అత్యుత్తమ పదకొండు మందినే మైదానంలోకి పంపిస్తాం. టెస్టు క్రికెట్లో అవకాశాలకు వారంతా అర్హులే. వారంతా సామర్థ్యం మేరకు ఆడితే టీమ్ఇండియా ఎందుకు రాణించదో చెప్పండి. మేం మా ఆటగాళ్లకు అండగా ఉంటాం’ అని రాఠోడ్ అన్నాడు. చివరి టెస్టులో వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్కు చోటు లభిస్తుందని సమాచారం.
‘జస్ప్రీత్ బుమ్రాను వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. చివరి టెస్టులో అతనాడతాడో లేదో మ్యాచ్కు ముందు తెలుస్తుంది. వైద్యబృందం సూచనలను బట్టి మేం నిర్ణయం తీసుకుంటాం. అతడు ఆడాలనుకుంటే ఆడతాడు. లేదంటే లేదు. ఏదేమైనా తుదిజట్టు వివరాలు మ్యాచ్కు ముందు తెలుస్తాయి’ అని విక్రమ్ రాఠోడ్ తెలిపాడు.
ఇవీ చదవండి
‘అశ్విన్ ఒక్కడే 800 వికెట్లు తీస్తాడు’
వాహ్ అజహరుద్దీన్.. నువ్వెంతో గ్రేట్: సెహ్వాగ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?