బుమ్రాకు.. 5 సెకన్లు చాలు!
టీమ్ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యంత తెలివైన పేసరని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అన్నాడు. అతడి బౌలింగ్ను ఎదుర్కొనేందుకు మహామహులైన బ్యాట్స్మెన్ సైతం జంకుతున్నారని ప్రశంసించాడు. దేహభాషలో కాకుండా అతడు ఎంచుకొనే లెంగ్తుల్లో దూకుడు కనిపిస్తుందని...
ఈ స్మార్ట్ పేసర్కు కావాల్సింది కాస్తంత కండబలమే అంటున్న అక్తర్
ఇంటర్నెట్: టీమ్ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యంత తెలివైన పేసరని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అన్నాడు. అతడి బౌలింగ్ను ఎదుర్కొనేందుకు మహామహులైన బ్యాట్స్మెన్ సైతం జంకుతున్నారని ప్రశంసించాడు. దేహభాషలో కాకుండా అతడు ఎంచుకొనే లెంగ్తుల్లో దూకుడు కనిపిస్తుందని వివరించాడు. కేవలం 5 సెకన్ల వ్యవధిలోనే అతడు బ్యాట్స్మన్ను బోల్తా కొట్టించేస్తాడని వెల్లడించాడు. సీనియర్ పేసర్లైన ఇషాంత్, షమి, ఉమేశ్ లేకున్నా అతడు బౌలింగ్ దాడి అద్భుతమని కొనియాడాడు.
‘ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యంత తెలివైన పేసర్. ఒకప్పుడు మహ్మద్ ఆసిఫ్ను ఎలా ఎదుర్కోవాలని వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. ఆసియా టెస్టు ఛాంపియన్షిప్లో అయితే ఏబీ డివిలియర్స్ ఏడ్చినంత పనిచేశాడు. ఆసిఫ్ తర్వాత బుమ్రా అలా కనిపిస్తున్నాడు. టెస్టు క్రికెట్లో అతడి ఫిట్నెస్పై కొందరికి సందేహాలున్నాయి. నేనూ అతడిని దగ్గరుండి పరిశీలిస్తున్నాను. అతడు వేగంగా పుంజుకుంటాడు. బుమ్రాది చక్కని మూర్తిమత్వం’ అని అక్తర్ అన్నాడు.
‘బుమ్రా దూకుడు అతడి దేహంలో కాకుండా బంతి లెంగ్త్లో కనిపిస్తుంది. ఆ లెంగ్త్తోనే అతడు బ్యాట్స్మెన్ను ఓడిస్తాడు. అతడు చాలా మంచోడు. కానీ బంతి వేసేందుకు ఐదు సెకన్ల ముందు లెంగ్త్ ద్వారా తన దూకుడేంటో చూపిస్తాడు. నువ్వు నా కన్నా మెరుగైనవాడివి కాదని సవాల్ చేస్తాడు. తన బౌలింగ్ గురించి ఆలోచించడం నాకు బాగా నచ్చుతుంది. అతడు జట్టు మనిషి. చక్కని ఫాస్ట్ బౌలర్. మ్యాచ్ విజేత. అతడికి కాస్త కండబలం మాత్రమే అవసరమని నా ఉద్దేశం. ఆసియాకప్లో హార్దిక్ పాండ్యకూ ఇదే విషయం చెప్పాను. ఈ విషయంలో రవిశాస్త్రీ నాతో ఏకీభవించాడు’ అని అక్తర్ పేర్కొన్నాడు.
ఇవీ చదవండి
కోహ్లీసేన.. 2021లో మారాలిక!
మానసిక ఇబ్బందుల్లో స్మిత్..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం