Beijing Olympics: అమెరికా.. ఆస్ట్రేలియా.. బ్రిటన్.. ఇప్పుడు కెనడా!
చైనా రాజధాని బీజింగ్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న శీతాకాల ఒలింపిక్స్ను అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలు దౌత్యపరంగా బహిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశాల బాటలోనే కెనడా కూడా నడుస్తోంది. అమెరికాలాగే తాము కూడా బీజింగ్ ఒలింపిక్స్ను బహిష్కరిస్తున్నట్లు తాజాగా కెనడా ప్రధాన
టొరంటో: చైనా రాజధాని బీజింగ్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న శీతాకాల ఒలింపిక్స్ను అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలు దౌత్యపరంగా బహిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశాల బాటలోనే కెనడా కూడా నడుస్తోంది. అమెరికాలాగే తాము కూడా బీజింగ్ ఒలింపిక్స్ను బహిష్కరిస్తున్నట్లు తాజాగా కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటించారు.
‘చైనా ప్రభుత్వం మానవ హక్కులను పదే పదే ఉల్లంఘిస్తోంది. ఈ విషయలో మేమంతా ఆందోళన చెందుతున్నాం. అందుకే బీజింగ్ ఒలింపిక్స్ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నాం. మా దేశం నుంచి దౌత్యవేత్తలను ఒలింపిక్స్ క్రీడావేడుకలకు పంపించకూడదని నిర్ణయం తీసుకున్నాం’’అని ప్రధాని వెల్లడించారు. అయితే, కెనడా అథ్లెట్లు మాత్రం ఈ క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు. మరికొన్ని దేశాలు సైతం బీజింగ్ ఒలింపిక్స్ను దౌత్యపరంగా బహిష్కరించే యోచనలో ఉన్నాయి.
బీజింగ్ ఒలింపిక్స్ 2022 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు జరగనున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచమంతా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ శీతాకాల ఒలింపిక్స్ నిర్వహణ కోసం చైనా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. క్లోజ్డ్ లూప్ సిస్టమ్తో అథ్లెట్లు సురక్షితంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తాము సిద్ధంగా ఉన్నామని, ఒలింపిక్స్ క్రీడలను ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహిస్తామని ఒలింపిక్స్ కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.