వార్నర్ దశావతారం..హార్దిక్ హ్యాపీ హ్యాపీ!
కరోనా..కోరుకోని అతిథి! ఆ మహమ్మారి దాదాపు అందరి జీవితాల్ని తలకిందులు చేసింది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని ప్రపంచమంతా లాక్డౌన్లోకి వెళ్లింది. అయితే ఎప్పుడూ ఆటతో బిజీబిజీగా ఉండే....
విరామంలో క్రికెటర్ల సందడి
కరోనా..కోరుకోని అతిథి! ఆ మహమ్మారి దాదాపు అందరి జీవితాల్ని తలకిందులు చేసింది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని ప్రపంచమంతా లాక్డౌన్లోకి వెళ్లింది. అయితే ఎప్పుడూ ఆటతో బిజీబిజీగా ఉండే క్రికెటర్లకు ఆ సమయం మంచి విరామంగా లభించింది. చేదు జ్ఞాపకంగా మిగిలిపోయిన ఆ సమయాన్ని మన అభిమాన క్రికెటర్లు ఎలా ఆస్వాదించారో చూద్దాం.
బుట్టుబొమ్మతో ఊపేశాడు
బహుశా లాక్డౌన్లో డేవిడ్ వార్నర్ కంటే మరెవరు గొప్పగా ఎంజాయ్ చేసి ఉండరు! ఫ్యామిలీతో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తూ అభిమానులతో ఎప్పటికప్పుడు ఆ విశేషాల్ని వార్నర్ పంచుకున్నాడు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయినప్పటికీ అతడికి తెలుగు అభిమానులు ఎక్కువ. ఐపీఎల్లో హైదరాబాద్ తరఫున ఆడటమే దానికి కారణం. తన ఫ్యాన్స్కు తగ్గట్లుగా టాలీవుడ్లో హిట్ అయిన పాటలను టిక్టాక్ చేస్తూ లాక్డౌన్లో అలరించాడు. అలవైకుంఠపురంలో బుట్టబొమ్మ, రాములో రాములా; సరిలేరు నీకెవ్వరులో మైండ్ బ్లాక్ పాటలకు స్టెప్పులు ఇరగతీశాడు. అంతేగాక బాహుబలి సినిమాలోని డైలాగ్స్కు టిక్టాక్ చేశాడు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.
ఇంటిరుచులతో కోహ్లీ
గత దశాబ్దంలోనే విరాట్ కోహ్లీ అత్యంత బిజీయెస్ట్ క్రికెటర్. కెప్టెన్గా, మేటి బ్యాట్స్మెన్గా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. అయితే కరోనా వల్ల అతడికి మంచి విరామం దక్కింది. తన భార్య అనుష్కశర్మతో కలిసి ఆ సమయాన్ని ఆస్వాదించాడు. ఇంటి భోజనాన్ని ఆస్వాదించాడు. అనుష్కతో కలిసి సరదాగా క్రికెట్ ఆడటం, తన మిత్రులతో కలిసి లైవ్ చాట్లో కబుర్లు చెప్పాడు. అంతేగాక పుస్తకాలు చదివాడు.
హిట్మ్యాన్ ముచ్చట్లు
ఫిబ్రవరిలో న్యూజిలాండ్ పర్యటనలో గాయపడిన రోహిత్ శర్మ లాక్డౌన్లో ఫిట్నెస్ను మెరుగుపర్చుకున్నాడు. గాయంతో హిట్మ్యాన్ తొలుత దక్షిణాఫ్రికా సిరీస్కు దూరమైన విషయం తెలిసిందే. కానీ కరోనా కారణంగా ఆ సిరీస్ రద్దవ్వడం, ఆ తర్వాత లాక్డౌన్ విధించడంతో.. పూర్తిగా కోలుకోవడానికి ఎంతో సమయం దొరికింది. అంతేగాక విదేశీ క్రికెటర్లతో హిట్మ్యాన్ ఇన్స్టాగ్రామ్ లైవ్లో ముచ్చటించాడు. డేవిడ్ వార్నర్, పీటర్సన్తో తన ఆలోచనలు, జ్ఞాపకాలను పంచుకున్నాడు. తన గారాల పట్టి సమైరాతో, కుటుంబంతో కలిసి కాలక్షేపం చేశాడు.
చాహల్ పెళ్లి కబుర్లు
లాక్డౌన్లో యుజువేంద్ర చాహల్ తన జీవిత భాగస్వామిని అభిమానులకు పరిచయం చేశాడు. యూట్యూబర్ ధనశ్రీతో నిశ్చితార్థం చేసుకున్నాడు. అంతేగాక తన తండ్రితో కలిసి స్టెప్పులు వేస్తూ సరదాగా వీడియోలు చేయడం, చెస్ ఆడటం చేశాడు. ఇటీవల యూజీ-ధనశ్రీ అతికొద్ది మంది ఆత్మీయుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
పాండ్యకు కొత్త బాధ్యతలు
హార్దిక్ పాండ్యకు 2020 ఎంతో స్పెషల్. తన జీవిత భాగస్వామిగా నటాషా స్టాంకోవిచ్ను ఎంచుకోవడం, తండ్రి కావడం ఈ ఏడాదే జరిగాయి. జనవరి1న నటాషాకు సముద్ర జలాల్లో తన ప్రేమను హార్దిక్ వ్యక్తపరిచాడు. అనంతరం మేలో తాను తండ్రి కాబోతున్నానని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. జులై 30న తండ్రయ్యాడు. అయితే లాక్డౌన్ సమయాన్ని హార్దిక్ ఎంతో ఆస్వాదించాడు. తన ఫిట్నెస్ మెరుగుపర్చుకున్నాడు. వెన్నుగాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి తీవ్రంగా శ్రమించాడు. అంతేగాక తన భార్య ప్రసవ సమయంలో తోడుగా ఉన్నాడు. భర్తగా, తండ్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు.
యువక్రికెటర్లకు యువీ మార్గనిర్దేశకం
లాక్డౌన్లో యువక్రికెటర్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ మార్గనిర్దేశం చేశాడు. జిమ్ను సిద్ధం చేసి వాళ్లతో కలిసి కసరత్తులు చేశాడు. వాళ్లకి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ ఆటలో మెరుగవ్వడానికి ఎంతో దోహదపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోలు తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. అంతేగాక ఎప్పటిలానే లాక్డౌన్లోనూ యువీ సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉన్నాడు. కరోనా కాలంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరాడు.
రాహుల్కు పీడకలలు
ఈ ఏడాది ఆరంభంలో కేఎల్ రాహుల్ సూపర్ఫామ్లో ఉన్నాడు. అయితే కరోనా కారణంగా కొన్ని నెలలు ఇంట్లోనే ఉండటంతో తాను మునుపటిలా బ్యాటింగ్ చేస్తానో లేదోనని రాహుల్ కాస్త భయపడ్డాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా తెలిపాడు. నిద్రలో కలలు వస్తున్నాయని చెప్పాడు. కాగా, లాక్డౌన్లో శారీరక కసరత్తులు చేశాడు. ఫిట్నెస్ను మెరుగుపర్చుకున్నాడు. తన పెంపుడు జంతువులతో కాలక్షేపం చేశాడు.
గబ్బర్.. ది ఫ్యామిలీ మ్యాన్
శిఖర్ ధావన్ లాక్డౌన్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాడు. కుటుంబంతో కలిసి సరదా వీడియోలు చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. భార్యతో జరిగే చిలిపి గొడవలను బాలీవుడ్ పాటలతో ఫన్నీగా చిత్రీకరించి వీడియోలు పంచుకున్నాడు. ఎక్కువ రోజులు ఇంట్లో ఉంటే భర్తకు ఎన్నో కష్టాలు ఎదురవుతాయని హాస్యాన్ని పండించాడు. ఇవి నెట్టింట్లో వైరల్గా మారాయి.
సుస్థిర స్థానం కోసం సాధన
యువ క్రికెటర్ సంజు శాంసన్ లాక్డౌన్లో తన ఫిట్నెస్ను మెరుగుపర్చుకున్నాడు. అంతేగాక బ్యాటింగ్లో మెళుకువలు నేర్చుకున్నాడు. టీమిండియాలో సుస్థిర స్థానం సాధించాలని కసితో సాధన చేశాడు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేశాడు.
- ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి.