Sports Budget : ‘ఖేలో ఇండియా’కు పెరిగిన బడ్జెట్.. గతేడాది కంటే రూ. 300 కోట్లు అధికం
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఖేలో ఇండియా కార్యక్రమం కోసం...
ఇంటర్నెట్ డెస్క్: క్రీడా రంగానికి ఈసారి బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. టోక్యోలో భారత్ పతకాలు సాధించిన నేపథ్యంలో గతంతో పోలిస్తే 305.58 కోట్లు అధికంగా కేంద్రం కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.3062.60 కోట్లు కేటాయింపులు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. గతేడాది క్రీడా రంగానికి కేంద్రం రూ.2,757 కోట్లు కేటాయించింది.
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఖేలో ఇండియా కార్యక్రమం కోసం గతేడాది కంటే ఈసారి రూ.316 కోట్లను ఎక్కువగా కేటాయించింది. గతేడాది ఖేలో ఇండియా కోసం రూ. 657.71 కోట్లను కేటాయించగా.. ఈ సారి దానిని రూ.970 కోట్లకు పెంచింది. అలానే క్రీడాకారులకు బహుమతిగా ఇచ్చే నజరానాలు, అవార్డుల కోసం రూ.357 కోట్లను ప్రత్యేకించింది. గతేడాది ఈ మొత్తం రూ.245 కోట్లుగా ఉంది. అయితే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) బడ్జెట్ను రూ.7.41 కోట్లు తగ్గించి రూ. 653 కోట్లకు పరిమితం చేసింది. జాతీయ క్రీడాభివృద్ధి నిధిని కూడా రూ.9 కోట్లు తగ్గించి రూ.16 కోట్లను (గతేడాది రూ. 25 కోట్లు) మాత్రమే కేటాయించింది. నేషనల్ సర్వీస్ స్కీమ్ కోసం రూ.118.50 కోట్లను అదనంగా కేటాయించి.. ఆ మొత్తాన్ని రూ.283.50 కోట్లకు చేర్చింది. క్రీడాకారులకు ఇన్సెంటివ్స్ కోసం రూ.55 కోట్లు, జాతీయ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ (ఎన్ఎస్ఎఫ్ఎస్)కు రూ.280 కోట్ల నిధులను కేంద్రం బడ్జెట్లో కేటాయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా