మాల్దీవుల్లో.. చాహల్‌, ధన విహార యాత్ర..!

టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ దంపతులు విహారయాత్రలో మునిగిపోయారు. లాక్‌డౌన్‌లో నిశ్చితార్థం చేసుకున్న వీరు డిసెంబర్‌లో ఒక్కటైన సంగతి తెలిసిందే...

Updated : 20 Sep 2022 15:54 IST

ఆకట్టుకుంటున్న ఫొటోలు, వీడియోలు..

(Photo: Chahal twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ దంపతులు విహారయాత్రలో మునిగిపోయారు. లాక్‌డౌన్‌లో నిశ్చితార్థం చేసుకున్న వీరు డిసెంబర్‌లో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల క్రికెట్‌ తర్వాత విశ్రాంతి దొరకడంతో చాహల్‌ అదే సమయంలో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో నిరాడంబరంగా ధనశ్రీని వివాహమాడాడు.

అలా జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించిన చాహల్‌ దంపతులు ఇప్పుడు విహారయాత్రకు వెళ్లారు. ప్రముఖ వెకేషన్‌ డెస్టినేషన్‌ మాల్దీవ్స్‌కు వెళ్లి.. ప్రశాంతమైన సముద్ర జలాల్లో సరదాగా విహరిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ తీసుకున్న ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫొటోలు ఎంతో అందంగా ఉండడంతో నెటిజెన్లు ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా వాటిపై ఓ లుక్కేయండి..






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని