Chahal-Dhanashree: చాహల్, ధనశ్రీ విడిపోతున్నారా.. ఆ పోస్టుల వెనుక అర్థమేంటీ?
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (DhanaShree Verma) జంటకు సోషల్మీడియాలో
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (DhanaShree Verma) జంటకు సోషల్మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ షేర్ చేస్తూ రొమాంటిక్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా వీరు సోషల్మీడియాలో పెట్టిన పోస్టులు అభిమానులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. చాహల్, ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారేమోనన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అసలేం జరిగిందంటే..
చాహల్ బుధవారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. అందులో ‘కొత్త జీవితం మొదలవుతోంది (New Life Loading..)’ అని రాసి ఉంది. దీంతో ఈ ఫొటో నెట్టింట వైరల్గా మారింది. ధనశ్రీ తల్లికాబోతుందేమో.. చాహల్ త్వరలోనే శుభవార్త చెప్పనున్నారంటూ అభిమానులు భావించారు. అయితే అదే సమయంలో చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ తన ఇన్స్టాగ్రామ్లో చాహల్ పేరును తొలగించడంతో గందరగోళం మొదలైంది.
పెళ్లి తర్వాత ధనశ్రీ వర్మ చాహల్గా ఉన్న పేరును ఇప్పుడు ఆమె ధనశ్రీ వర్మగా మార్చుకుంది. నిజానికి చాహల్ పోస్ట్ కంటే ముందే ఆమె తన పేరులో నుంచి చాహల్ పదాన్ని తొలగించుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాక, నిన్న ఆమె ఓ ఫొటోను షేర్ చేస్తూ ‘‘యువరాణి తన బాధను కూడా శక్తిగా మార్చుకుంటుంది’’ అని రాసుకొచ్చింది. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. చాహల్ జంట మధ్య బంధం సరిగా లేదంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే వీటిపై ఇటు చాహల్.. అటు ధనశ్రీ స్పందించలేదు.
ముంబయికి చెందిన డెంటిస్ట్, కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వద్ద చాహల్ డ్యాన్స్ క్లాసులకు వెళ్లాడు. ఆ పరిచయం ప్రేమగా మారి 2020 డిసెంబరులో వీరిద్దరూ గురుగ్రామ్లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇటీవల జరిగిన టీ20 మెగా టోర్నీలోనూ చాహల్ ఆడే మ్యాచ్లకు ధనశ్రీ వచ్చి గ్యాలరీ నుంచి ఉత్సాహపర్చింది. ఆ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్మీడియాలో షేర్ చేసింది కూడా. అయితే కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇక, కెరీర్ పరంగా చాహల్ త్వరలోనే ఆసియా కప్ 2022 టోర్నీలో ఆడనున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ