Shivam Dube : శివమ్ దూబే.. ఈ ఆరడుగుల బుల్లెట్.. నయా ‘యువీ’!
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సహచరులకు భరోసా ఇచ్చేలా...
చెన్నై జట్టులో కీలకంగా మారిన యువ బ్యాటర్
అతడు ‘ఆరడుగుల బుల్లెట్’.. సినీ హీరోలకు ఏమాత్రం తగ్గని గ్లామర్.. దారితప్పి క్రికెట్ వైపు అడుగులు వేశాడేమోననిపిస్తుంది. అయితే.. ఈ 28 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజ్లోకి వచ్చాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టాల్సిందే. టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ను చూసినట్లు అనిపిస్తుంటుందని సహచరులు ‘ఆట’పట్టిస్తుంటారు. నిజంగానే యువీని తలపించేలా భారీ షాట్లను అలవోకగా కొట్టేయగలడు. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందనకుంటా.. అతగాడే చెన్నై బ్యాటర్ శివమ్ దూబే..
3, 49, 57, 3, 95.. ఇవీ టీ20 లీగ్ ఈ సీజన్లో యువ బ్యాటర్ బ్యాట్ నుంచి వచ్చిన పరుగులు.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సహచరులకు భరోసా ఇచ్చేలా ఆడేస్తాడు. ఈ సీజన్లో వరుస అపజయాలతో చెన్నై తీవ్ర విమర్శలు పాలైన సమయంలో.. తన అద్భుత ఆటతీరుతో దూబే జట్టును బోణీ కొట్టించాడు. 95* పరుగులతో కీలక పాత్ర పోషించాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో తృటిలో శతకం చేజార్చుకున్నప్పటికీ చిరస్మరణీయ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. చెన్నై 36/2 స్కోరుతో ఉన్నప్పుడు క్రీజ్లోకి వచ్చిన శివమ్ ఓపెనర్ రాబిన్ ఉతప్ప (88)తో కలిసి మూడో వికెట్కు కేవలం 73 బంతుల్లోనే 165 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో 11 ఏళ్ల కిందట బెంగళూరు, చెన్నై జట్ల మధ్య నమోదైన రికార్డును శివమ్ సమం చేశాడు. అప్పటి చెన్నై బ్యాటర్ మురళీ విజయ్ (95) కూడా ఇదే స్కోరు సాధించాడు.
అంతకుముందు లఖ్నవూతో జరిగిన మ్యాచ్లోనూ దూబే సెకండ్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చి విలువైన (49) పరుగులు చేశాడు. అదేవిధంగా పంజాబ్తో 181 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై 126 పరుగులకే కుప్పకూలింది. అయితే శివమ్ దూబే (57) అర్ధ శతకం సాధించడం విశేషం. ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. దూబేకు ముందు జోస్ బట్లర్ (218) కేవలం 11 పరుగులు మాత్రమే అధికంగా ఉన్నాడు. బ్యాటింగ్లో రాణిస్తున్నప్పటికీ.. బౌలింగ్లోనూ ప్రదర్శన బాగుంటేనే టీమ్ఇండియాకు ‘యువీ’ లాంటి ఆల్రౌండర్ లేని లోటును భర్తీ చేసే అవకాశం శివమ్ దూబే తలుపు తడుతుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
ఎవరీ శివమ్ దూబే..?
ముంబయిలో 1993లో జన్మించిన శివమ్ దూబే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, కుడి చేతి బౌలర్ కావడం గమనార్హం. కేవలం పంతొమ్మిదేళ్లకే ముంబయి అండర్ -23 (సీనియర్) జట్టులో స్థానం సంపాదించాడు. ఐదేళ్ల కిందట రంజీ ట్రోఫీలోకి డెబ్యూ చేసిన శివమ్ దూబే ఇప్పటి వరకు 16 మ్యాచుల్లో 48.19 సగటుతో 1,012 పరుగులు చేశాడు. బౌలర్గానూ 40 వికెట్లు పడగొట్టాడు. రెండేళ్ల వ్యవధిలోనే 2019లో టీమ్ఇండియా తరఫున, ఐపీఎల్లో అరంగేట్రం చేసిన దూబేకు పెద్దగా అవకాశాలు దక్కలేదు.
దూబే గురించి మరికొన్ని విశేషాలు..
- టీ20 లీగ్లో బెంగళూరు, రాజస్థాన్తో జట్లలో ఆడిన దూబే.. ప్రస్తుతం చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
- భారీ షాట్లను కొట్టగలిగే 1.83 మీటర్ల పొడగరి దూబేను మెగా వేలంలో చెన్నై రూ. 4 కోట్లకు దక్కించుకుంది.
- శివమ్ దూబేకు 2021లో అంజుమ్ ఖాన్తో వివాహమైంది. వీరికి ఈ ఏడాది ఫిబ్రవరి 13న బాబు పుట్టాడు.
- సోషల్ మీడియాలో తక్కువ యాక్టివ్గా ఉండే శివమ్కు ఇన్స్టాలో 5.48 లక్షలు, ట్విటర్లో 1.95 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
- ట్విటర్లో12 మందినే ఫాలో అయ్యే శివమ్.. క్రికెట్కు సంబంధించి కాకుండా నరేంద్ర మోదీని మాత్రమే అనుసరిస్తున్నాడు.
- గతేడాది (2021) టీ20 లీగ్లో తొమ్మిది మ్యాచుల్లో 230 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 64 నాటౌట్.
- ఇక 2020 సీజన్లో 11 మ్యాచ్లు ఆడి 129 పరుగులు మాత్రమే చేశాడు. అయితే బౌలింగ్లో 2/15 ఉత్తమ బౌలింగ్తో నాలుగు వికెట్లు తీశాడు.
- అరంగేట్రం చేసిన 2019 సీజన్లోనైతే పెద్దగా అవకాశాలు రాలేదు. కేవలం నాలుగు మ్యాచ్లను మాత్రమే ఆడాడు. అందులోనూ 40 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 24 కావడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా