Gujarat Vs Chennai : చెన్నైపై సాహోరే ‘సాహా’.. గుజరాత్దే విజయం
టీ20 టోర్నీలో భాగంగా గుజరాత్, చెన్నై జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్
ముంబయి : టీ20 లీగ్లో గుజరాత్ విజయాలతో దూసుకుపోతోంది. స్వల్ప లక్ష్య ఛేదనలో చెన్నైపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 133/5 స్కోరు సాధించింది. అనంతరం గుజరాత్ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలో విజయం సాధించింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (67*) అర్ధ శతకంతో రాణించాడు. శుభ్మన్ గిల్ (18), వేడ్ (20), డేవిడ్ మిల్లర్ (15*) ఫర్వాలేదనిపించారు. చెన్నై బౌలర్లలో పతిరాన 2, మొయిన్ అలీ ఒక వికెట్ తీశారు. దీంతో టీ20 టోర్నీలో గుజరాత్ పదో గెలుపును సొంతం చేసుకుంది. ఇది చెన్నైకి తొమ్మిదో ఓటమి.
స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు
గుజరాత్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. మొయిన్ అలీ వేసిన 12 ఓవర్లో మథ్యూ వేడ్ (20) ఔటయ్యాడు. అతడు శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మతీశా పతిరాణా వేసిన 14 ఓవర్లో తొలి బంతికి హార్దిక్ పాండ్య (7) కూడా శివమ్ దూబేకే చిక్కాడు. 15 ఓవర్లకు గుజరాత్ 108/3 స్కోరుతో ఉంది. డేవిడ్ మిల్లర్ (3), వృద్ధీమాన్ సాహా (52) క్రీజులో ఉన్నారు. గుజరాత్ విజయానికి 30 బంతుల్లో 26 పరుగులు కావాలి.
శుభమన్ గిల్ ఔట్
గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. మతీశా పతిరాణా వేసిన ఎనిమిదో ఓవర్లో తొలి బంతికి శుభమన్ గిల్ (18) ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన వేడ్.. ఇదే ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. శాంటర్న్ వేసిన తొమ్మిదో ఓవర్లో ఐదు పరుగులు, మొయిన్ అలీ వేసిన తర్వాతి ఓవర్లోనూ ఐదు పరుగులు వచ్చాయి. 10 ఓవర్లకు గుజరాత్ 81/1తో ఉంది. మథ్యూ వేడ్ (18), వృద్ధీమాన్ సాహా (43) క్రీజులో ఉన్నారు.
పవర్ ప్లే పూర్తి
గుజరాత్ ఓపెనర్లు దూకుడుగా ఆడేస్తున్నారు. చెన్నై బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ధాటిగా పరుగులు రాబడుతున్నారు. 134 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. క్రీజ్లో వృద్ధిమాన్ సాహా (37*), శుభ్మన్ గిల్ (15*) ఉన్నారు. గుజరాత్ విజయానికి 84 బంతుల్లో 81 పరుగులు కావాలి.
దూకుడుగా ప్రారంభం..
చెన్నై నిర్దేశించిన స్వల్ప లక్ష్య ఛేదనను గుజరాత్ ప్రారంభించింది. ముకేశ్ చౌదరి వేసిన తొలి ఓవర్లోనే వృద్ధిమాన్ సాహా మూడు ఓవర్లు కొట్టాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తం 12 పరుగులు వచ్చాయి. సిమర్జిత్ సింగ్ వేసిన రెండో ఓవర్లో ఫోర్ సహా ఏడు పరుగులు వచ్చాయి. ప్రస్తుతం రెండు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. అంతకుముందు చెన్నై 20 ఓవర్లలో 133/9 స్కోరును సాధించింది.
గుజరాత్ లక్ష్యం 134 పరుగులు
గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోయారు. దీంతో గుజరాత్కు చెన్నై 134 పరుగులను మాత్రమే లక్ష్యంగా నిర్దేశించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (53) అర్ధశతకం సాధించాడు. జగదీశన్ (39*), మొయిన్ అలీ (21) ఫర్వాలేదనిపించారు. డేవన్ కాన్వే (5), శివమ్ దూబే (0), ఎంఎస్ ధోనీ (7) విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ 2.. రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, సాయికిశోర్ తలో వికెట్ తీశారు.
రుతురాజ్ హాఫ్ సెంచరీ
చెన్నై ఓపెనర్ రుతురాజ్ (51*) తన ఫామ్ను కొనసాగిస్తూ అర్ధశతకం సాధించాడు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి చెన్నై రెండు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజ్లో రుతురాజ్తోపాటు జగదీశన్ (28*) ఉన్నాడు. మధ్య ఓవర్లలో గుజరాత్ బౌలర్లు కాస్త కట్టుదిట్టంగా వేసినా ఓపికగా చెన్నై బ్యాటర్లు పరుగులు రాబట్టారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు 44 పరుగులు జోడించారు.
పుంజుకున్న బౌలర్లు
గుజరాత్ బౌలర్లు పుంజుకోవడంతో చెన్నై పరుగుల కోసం కష్టపడుతోంది. క్రీజ్లో కుదురుకుని పరుగులు సాధించిన మొయిన్ అలీ (21) సాయి కిశోర్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి రషీద్ ఖాన్ చేతికి చిక్కాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి చెన్నై రెండు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజ్లో రుతురాజ్ (38*), జగదీశన్ (5*) ఉన్నారు.
ముగిసిన పవర్ప్లే
ఆరంభంలో వికెట్ పడినా చెన్నై బ్యాటర్లు పవర్ప్లే ముగిసేసరికి కాస్త పుంజుకున్నారు. మరీ ముఖ్యంగా యాష్ దయాల్ వేసిన ఐదో ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్తో 15 పరుగులు రాబట్టారు. ఇక పవర్ప్లే చివరి ఓవర్లో రెండు సిక్సర్లు బాదారు. ఈ ఓవర్ను రషీద్ ఖాన్ వేశాడు. మొత్తం 17 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రస్తుతం ఆరు ఓవర్లు ముగిసేసరికి చెన్నై వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజ్లో రుతురాజ్ గైక్వాడ్ (23*), మొయిన్ అలీ (18*) ఉన్నారు.
కాన్వే ఔట్
చెన్నై బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే మూడో ఓవర్ తొలి బంతికే చెన్నైకి షాక్ తగిలింది. ఓపెనర్ డేవన్ కాన్వే (5) షమీ బౌలింగ్లో కీపర్ సాహాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం 3 ఓవర్లు ముగిసేసరికి చెన్నై వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. క్రీజ్లో రుతురాజ్ గైక్వాడ్ (3*), మొయిన్ అలీ (2*) ఉన్నారు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో పరుగుల రాక కష్టంగా ఉంది.
టాస్ నెగ్గిన చెన్నై
టీ20 టోర్నీలో భాగంగా గుజరాత్, చెన్నై జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోన్న గుజరాత్ ఇప్పటికే 9 విజయాలతో ప్లేఆఫ్స్కు చేరుకోగా.. 4 విజయాలతో 9వ స్థానంలో ఉన్న చెన్నైకి ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. ఆసీస్ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతికి సంతాపసూచికంగా చెన్నై, గుజరాత్ ఆటగాళ్లు నలుపు రంగు బ్యాండ్లను ధరించారు.
గుజరాత్ : సాహా, శుభ్మన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్య, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, షమీ
చెన్నై : రుతురాజ్ గైక్వాడ్, కాన్వే, మొయిన్ అలీ, శివమ్ దూబే, ఎన్. జగదీశన్, ధోనీ, మిచెల్ శాంట్నర్, ప్రశాంత్ సోలంకీ, సిమర్జీత్ సింగ్, ముఖేశ్ చౌదరి, పతిరాణా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్