CSK: తిరుగులేని చెన్నై.. పన్నెండోసారీ ప్లేఆఫ్స్లోకి!
ఐపీఎల్లో (IPL) అత్యంత విజయవంతమైన జట్టు ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK). నాలుగు సార్లు ఛాంపియన్గా నిలిచిన సీఎస్కే.. మరోసారి ప్లేఆఫ్స్లోకి దూసుకెళ్లింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ మరో రికార్డు సృష్టించింది. మెగా టోర్నీలో అత్యధిక సార్లు ప్లేఆఫ్స్కు చేరిన జట్టుగా ఇప్పటికే రికార్డుకెక్కిన చెన్నై.. ఆ సంఖ్యను మరింత పెంచుకుంది. తాజాగా దిల్లీ క్యాపిటల్స్ను ఓడించి మరీ చెన్నై (CSK) ప్లేఆఫ్స్ను బెర్తును ఖరారు చేసుకుంది. దీంతో మొత్తం 16 సీజన్లలో 12 సార్లు ప్లేఆఫ్స్కు చేరిన ఏకైక జట్టు సీఎస్కే. ఆ తర్వాత ముంబయి (ఈ సీజన్లో కాకుండా) 9 సార్లు చేరుకుంది. రెండు సీజన్లలో సీఎస్కేపై నిషేధం పడిన సంగతి తెలిసిందే. మరో రెండుసార్లు మాత్రమే లీగ్ స్టేజ్కు పరిమితమైంది. ఇప్పటి వరకు నాలుగు టైటిళ్లను సీఎస్కే తన ఖాతాలో వేసుకుంది. మరి ఏ సీజన్లో ఎలా అనేది ఓసారి చూద్దాం..
- 2008: ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. అయితే, అక్కడ రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడింది. దీంతో రన్నరప్గా నిలిచింది.
- 2009: సెమీఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో చెన్నై ఓడిపోయింది. దీంతో ఫైనల్కు చేరి కప్ను సాధిద్దామనే కల నెరవేరలేదు.
- 2010: వరుసగా రెండు సీజన్లలో అదరగొట్టిన సీఎస్కే మూడోసారి విజేతగా నిలిచింది. ఈ సీజన్ ఫైనల్లో ముంబయిని ఓడించి ఛాంపియన్గా అవతరించింది.
- 2011: డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన చెన్నై ఈసారి కూడా అదరగొట్టేసి విజేతగా నిలిచింది. ఫైనల్లో బెంగళూరును ఓడించి వరుసగా రెండోసారి ఛాంపియన్గా చెన్నై అవతరించింది.
- 2012: హ్యాట్రిక్ ఛాంపియన్గా నిలుద్దామనే ఆశలకు బ్రేక్ పడింది. ఫైనల్లో కోల్కతా నైట్రైడర్స్ చేతిలో ఓడిపోయింది.
- 2013: ఈసారి కూడా రన్నరప్గానే టోర్నీని ముగించింది. ఫైనల్కు చేరిన చెన్నై.. ముంబయి ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది.
- 2014: ఈ సీజన్లో ప్లేఆఫ్స్కు చేరిన చెన్నై మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండో క్వాలిఫయర్లో పంజాబ్ చేతిలో ఓడింది. కానీ, అదే ఏడాదిలో జరిగిన ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీ విజేతగా నిలిచింది.
- 2015: మరోసారి రన్నరప్గానే టోర్నీని ముగించింది. ఫైనల్ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. దీంతో అత్యధిక సార్లు ప్లేఆఫ్స్కు చేరిన జట్టుగా చెన్నై రికార్డు సృష్టించింది.
- 2018: వరుసగా రెండు సీజన్లలో (2016, 2017) నిషేధానికి గురైన చెన్నై... మళ్లీ పునరాగమనం చేసిన సీజన్లోనే ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది.
- 2019: ఈ సీజన్లోనూ చెన్నై మళ్లీ ఫైనల్కు దూసుకెళ్లింది. అయితే, ఫైనల్లో ఒక్క పరుగు తేడాతో ముంబయి చేతిలో ఓడిపోయి కప్ను చేజార్చుకుంది.
- 2021: అంతకుముందు ఏడాది (2020 సీజన్)లో లీగ్ స్టేజ్కే పరిమితమైన చెన్నై పుంజుకుంది. ఫైనల్లో కోల్కతా నైట్రైడర్స్ను చిత్తు చేసి మరీ నాలుగోసారి ధోనీసేన టైటిల్ను సొంతం చేసుకుంది.
- 2023: గతేడాది పేలవ ప్రదర్శనతో విమర్శలపాలైన చెన్నై.. ఈసారి మాత్రం అదరగొట్టింది. ధోనీకి చివరి సీజన్గా భావిస్తున్న సమయంలో ప్లేఆఫ్స్కు దూసుకెళ్లింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’