Chennai : చెన్నైకి ఈ సీజన్లో తొలి విజయమే.. కానీ, మధుర స్మృతులెన్నో.!
టీ20 మెగా టోర్నీ 15వ సీజన్లో చెన్నై జట్టు కాస్త ఆలస్యంగా బోణీ కొట్టినా.. అదిరిపోయింది. ఆరంభంలో కాస్త తడబాటుకు గురైనా.. ఆఖరికి భారీ స్కోరుతో ఇన్నింగ్స్ని ముగించింది....
ఇంటర్నెట్ డెస్క్ : టీ20 మెగా టోర్నీ 15వ సీజన్లో చెన్నై జట్టు కాస్త ఆలస్యంగా బోణీ కొట్టినా.. అదరగొట్టింది. ఆరంభంలో కాస్త తడబాటుకు గురైనా.. ఆఖరికి భారీ స్కోరుతో ఇన్నింగ్స్ని ముగించింది. భారీ లక్ష్యంతో ప్రత్యర్థి జట్టును ఛేదనకు ఆహ్వానించింది. బెంగళూరు కూడా తీవ్రంగా పోరాడిందని చెప్పుకోవాలి. సీనియర్ ఆటగాళ్లు విఫలమైనా.. యువ ఆటగాళ్లు బాగానే పోరాడారు. అయినా, చెన్నై బౌలర్లు సమష్టిగా రాణించడంతో ప్రత్యర్థి జట్టు తలవంచక తప్పలేదు. చెన్నై 23 పరుగుల తేడాతో గెలుపొంది మైలురాయి మ్యాచ్ను చిరస్మరణీయం చేసుకుంది. మరి ఇంత గొప్పగా సాగిన ఈ మ్యాచు ప్రత్యేకతలేంటో ఓసారి చూద్దాం.!
కెప్టెన్గా జడేజాకు తొలి విజయం..
ఈ సీజన్ ఆరంభానికి ముందే మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకొని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. మేటి ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించాడు. జడేజా బాధ్యతలు చేపట్టిన వెంటనే వరుసగా నాలుగు ఓటములు ఎదురయ్యాయి. వేరే ఆటగాడైతే తీవ్ర ఒత్తిడికి గురై ఆ బాధ్యతల నుంచి తప్పుకొనే వాడేమో.! కానీ, పక్కన ధోని ఉన్నాడన్న భరోసా, చెన్నై యాజమాన్యం అందించిన సహాకారంతో.. తొలి విజయం కోసం ఓపికగా ఎదురు చూశాడు. కెప్టెన్గా ఐదో మ్యాచులో తొలి విజయాన్ని అందుకున్నాడు. అందుకేనేమో, ఆ విజయం ఎప్పటికీ గుర్తుండి పోయేలా తన సహచరికి అంకితం చేశాడు.
చెన్నైకి 200వ మ్యాచ్..
టీ20 లీగ్లో అత్యంత విజయవంతమైన జట్టేదంటే మరో ఆలోచన లేకుండా ఎవరైనా ఇట్టే చెన్నై పేరు చెప్పేస్తారు. అభిమానులు అంతగా ఆ జట్టును సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆడిన 13 సీజన్లలో చెన్నై జట్టు నాలుగు సార్లు ఛాంపియన్గా (2010, 2011, 2018, 2021) నిలిచింది. మరో ఐదు సార్లు (2008, 2012, 2013, 2015, 2019) ఫైనల్ చేరిన చెన్నై త్రుటిలో ఓటమి పాలై రన్నరప్గా నిలిచింది. పొట్టి ఫార్మాట్లో ఇంతటి ఘనమైన రికార్డు మరే జట్టుకు లేకపోవడం గమనార్హం. టీ20 లీగ్లో చెన్నై జట్టు ఆడుతున్న 200వ మ్యాచులో ఘన విజయం సాధించడం మరో విశేషం. ఇప్పటి వరకు 200 మ్యాచులు ఆడిన చెన్నై జట్టు 118 మ్యాచుల్లో విజయం సాధించింది. మరో 80 మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఓ మ్యాచ్ టై కాగా, మరో మ్యాచులో ఫలితం తేలలేదు. మొత్తం మీద 59.54 విజయ శాతంతో చెన్నై అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2016, 2017 సీజన్లలో చెన్నై జట్టుపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
ఫస్టాఫ్లో తడబడినా..
నిన్న బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టు తొలి 10 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 60 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, సెకండాఫ్లో గేర్ మార్చిన రాబిన్ ఉతప్ప (88), శివమ్ దూబె (95*) ధాటిగా ఆడారు. దీంతో 11 నుంచి 20 ఓవర్ల మధ్య ఏకంగా చెన్నై 156 పరుగులు రాబట్టింది. టీ20 లీగ్లో ఓ మ్యాచ్ సెకండాఫ్లో ఇది మూడో అత్యుత్తమ స్కోరు కావడం విశేషం. మరోవైపు, చివరి 10 ఓవర్లన్నింటిలో 10 పైగా పరుగులు రాబట్టడం గమనార్హం.
బెంగళూరు రికార్డు సమం..
బెంగళూరు జట్టులో ఎంతో మంది మేటి ఆటగాళ్లున్నా.. టీ20 లీగ్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయారు. అయినా, మైదానంలో ఆ జట్టు ప్రదర్శనను తక్కువ అంచనా వేయలేం. సుడిగాలి ఇన్నింగ్స్లతో ఎన్నో రికార్డులు నమోదు చేశారు. టీ20 లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు ఆ జట్టు 19 సార్లు 200+ స్కోర్లను నమోదు చేసింది. తాజాగా, బెంగళూరుతోనే జరిగిన మ్యాచులో చెన్నై జట్టు ఈ రికార్డును సమం చేసింది. చెన్నై కూడా 19 సార్లు 200కి పైగా స్కోర్లను నమోదు చేసిన బెంగళూరు జట్టుతో సమానంగా కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?