CSK vs GT: జడేజా సంచలన బ్యాటింగ్.. ఐదోసారి కప్పును ముద్దాడిన చెన్నై
ఉత్కంఠగా సాగిన ఐపీఎల్-16 ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించి ఐదోసారి టైటిల్ విజేతగా అవతరించింది. వర్షం అంతరాయంతో 15 ఓవర్లకు 171 పరుగుల లక్ష్యానికి కుదించిన మ్యాచ్లో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అహ్మదాబాద్: ఐపీఎల్ ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో గుజరాత్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఐదోసారి టైటిల్ విజేతగా అవతరించింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ధోనీ సేన చివరి బంతికి విజయం సాధించింది. చివరి ఓవర్ (మోహిత్ శర్మ)లో 13 పరుగులు అవసరం కాగా.. మొదటి నాలుగు బంతుల్లో మూడే పరుగులు రావడంతో చివరి రెండు బంతులు సమీకరణం 10 పరుగులుగా మారింది. దీంతో గెలుపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతమే చేశాడు. జడ్డూ వరుసగా సిక్స్, ఫోర్ బాదడంతో చెన్నై శిబిరం ఆనందంలో మునిగితేలింది. వర్షం అంతరాయం కలిగించడంతో చెన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులకు కుదించారు. దీంతో బ్యాటింగ్కు దిగిన చెన్నై 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై జట్టులో కాన్వే(47), శివమ్ దూబె(32*), రహానె(27), రుతురాజ్(26), రాయుడు(19) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(96), సాహా(54), గిల్(39) చెలరేగి ఆడారు.
171 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన చెన్నైకి ఓపెనర్లు డెవాన్ కాన్వే(47: 25 బంతుల్లో 2 సిక్స్లు, 4 ఫోర్లు), రుతురాజ్ గైక్వాడ్(26: 16 బంతుల్లో మూడు ఫోర్లు, సిక్స్) మంచి శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్కు వీరి జోడి 6.3 ఓవర్లలో 74 పరుగులు చేశారు. తొలి ఓవర్ నుంచే విరుచుకుపడిన వీరు ఫోర్లు, సిక్సర్లతో గుజరాత్ బౌలర్లను ఆటాడుకున్నారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న వీరిద్దరిని నూర్ అహ్మద్ ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. భారీ షాట్ ఆడే క్రమంలో రుతురాజ్ రషీద్ ఖాన్కు చిక్కగా, మోహిత్ శర్మ క్యాచ్ పట్టడంతో కాన్వే ఔటయ్యాడు. దీంతో శివమ్ దూబె(32: 21 బంతుల్లో 2 సిక్స్లు)తో జట్టు కట్టిన అజింక్యా రహానె(27*: 13 బంతుల్లో 2 సిక్స్లు, 2 ఫోర్లు) ధాటిగా ఆడాడు. ఉన్నంత సేపు సిక్స్లు, ఫోర్లతో అలరించాడు. ఈ క్రమంలో 117 పరుగుల వద్ద రహానె భారీ షాట్కు ప్రయత్నించి మోహిత్శర్మ బౌలింగ్లో విజయ్ శంకర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
దీంతో చెన్నై బ్యాటింగ్ కొంచెం నెమ్మదించింది. అయితే 12వ ఓవర్లో రాయుడు(19: 8 బంతుల్లో 2 సిక్స్లు, 1 ఫోర్)తో విరుచుకుపడ్డాడు. మరోవైపు దూబె సైతం ధాటిగా అడడంతో చెన్నై విజయం దిశగా దూసుకొచ్చింది. ఈ క్రమంలో 149 పరుగుల వద్ద రాయుడు, ధోనీ వరుస బంతుల్లో ఔట్ కావడంతో ఒకింత ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సాధించాల్సిన లక్ష్యం తక్కువే ఉండడం, క్రీజులో దూబే, జడేజా(15*: 6 బంతుల్లో సిక్స్, ఫోర్) ఉండడంతో చెన్నై గెలుపుపై ధీమాగానే ఉంది. అయితే చివర్ ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా, తొలి నాలుగు బంతులకు మూడే పరుగులు రావడంతో గుజరాత్ విజయం సాధిస్తుందనుకున్నారు. అయితే అనూహ్యంగా చెలరేగిన జడేజా వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి చెన్నైకి మరుపురాని విజయాన్నిందించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..