Sports News: సాహో ఛెత్రీ.. మెస్సీని వెనక్కి నెట్టాడు
భారత ఫుట్బాల్ జట్టు సారథి సునిల్ ఛెత్రీ అరుదైన ఘనత నెలకొల్పాడు. దిగ్గజ ఫుట్బాలర్, అర్జెంటీనా సూపర్స్టార్ లయోనల్ మెస్సీని వెనక్కి నెట్టాడు. తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని పొదిగాడు. ప్రస్తుతం ఆడుతున్న వారిలో 74 గోల్స్తో అత్యధిక గోల్స్ కొట్టిన రెండో ఆటగాడిగా చరిత్ర...
ఆల్టైమ్ టాప్-10కు ఒక్క గోల్ దూరం
దోహా: భారత ఫుట్బాల్ జట్టు సారథి సునిల్ ఛెత్రీ అరుదైన ఘనత నెలకొల్పాడు. దిగ్గజ ఫుట్బాలర్, అర్జెంటీనా సూపర్స్టార్ లయోనల్ మెస్సీని వెనక్కి నెట్టాడు. తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని పొదిగాడు. ప్రస్తుతం ఆడుతున్న వారిలో 74 గోల్స్తో అత్యధిక గోల్స్ కొట్టిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. పోర్చుగల్కు చెందిన క్రిస్టియానో రొనాల్డొ (103) తర్వాతి స్థానంలో నిలిచాడు.
ఫిఫా ప్రపంచకప్ 2022, ఏఎఫ్సీ ఆసియా కప్ 2023కు సంయుక్తంగా జరిగిన ప్రిలిమినరీ అర్హత మ్యాచులో బంగ్లాదేశ్తో భారత్ పోటీపడింది. ఆఖర్లో ఛెత్రీ గోల్ కొట్టి ప్రపంచకప్ అర్హత పోటీల్లో ఆరేళ్ల తర్వాత టీమ్ఇండియాకు తొలి విజయం అందించాడు. 79వ నిమిషంలో ఎడమవైపు నుంచి ఆషిక్ కురునియన్ ఇచ్చిన క్రాస్ను దూరం నుంచి అతడు గోల్గా మలిచాడు.
గోల్స్ పరంగా మెస్సీ కన్నా రెండు, అలీ మబ్కౌత్ (73) కన్నా ఒక స్థానం ముందంజలో ఛెత్రీ నిలిచాడు. గత గురువారం చిలీతో జరిగిన ప్రపంచకప్ అర్హత మ్యాచ్లో మెస్సీ 72వ గోల్ చేశాడు. మలేసియాతో మ్యాచులో మబ్కౌత్ 73వ గోల్ చేయడం గమనార్హం.
ఇక ఆల్టైమ్ టాప్-10లో ప్రవేశించేందుకు ఛెత్రీ కేవలం ఒకేఒక్క గోల్ దూరంలో ఉన్నాడు. శాండర్ కోసిస్ (హంగేరి), కునిషిగె కుమమోటో (జపాన్), బషర్ అబ్దుల్లా (కువైట్ ) 75 గోల్స్తో అతడి కన్నా ముందున్నారు. 74వ గోల్ సాధించిన ఛెత్రీని భారత ఫుట్బాల్ సంఘం అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ ప్రశంసించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’