Chris Morris: ప్రొటీస్ జట్టుకి నేను ఆడటం ఇక కష్టమే: క్రిస్ మోరిస్
అంతర్జాతీయ క్రికెట్ ఆడటంపై దక్షిణాఫ్రికా క్రికెటర్ క్రిస్ మోరిస్ వ్యాఖ్యలు
ఇంటర్నెట్ డెస్క్: ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ దక్షిణాఫ్రికా జట్టులో తన స్థానంపై క్లారిటీ ఇచ్చేశాడు. జాతీయ జట్టు తరఫున ఆడటం ఇక కష్టమేనని తేల్చి చెప్పాడు. మోరిస్ కొనసాగకపోవడంపై క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) కూడా ఇప్పటికే ఓ అంచనాకి వచ్చేసింది. ‘సౌతాఫ్రికా జట్టుకు ఆడే రోజులు ఇక ముగిసినట్టే. అయితే నేను అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించలేదు. నేను ఎలా ఉన్నానో వారికి (సీఎస్ఏ)కి తెలుసు. అలానే నాకూ తెలుసు. అయితే ప్రొటీస్కు ఆడే రోజులు అయిపోయాయని మాత్రం భావిస్తున్నా. ఈ విషయం సీఎస్ఏకూ తెలుసు’’ అని మోరిస్ వ్యాఖ్యానించాడు. 34 ఏళ్ల క్రిస్ మోరిస్ దక్షిణాఫ్రికా తరఫున చివరి మ్యాచ్ను రెండేళ్ల కిందట ఆడాడు. అప్పటి నుంచి స్థానం లేకపోవడంతో పలు లీగ్ల్లో ఆడుతున్నాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ ఏడాదే అత్యధిక మొత్తం (16.25 కోట్లు)తో మోరిస్ను ఆర్ఆర్ సొంతం చేసుకుంది. అయితే ఈ సీజన్లో పెద్దగా రాణించిందేమీ లేదు.
అంతర్జాతీయ క్రికెట్కు తన రిటైర్మెంట్పై మోరిస్ మాట్లాడుతూ.. ‘‘రిటైర్మెంట్పై ఇంతవరకు అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు. కానీ నా అంతర్జాతీయ క్రికెట్ మాత్రం ముగిసిందనే చెప్పాలి. ప్రస్తుతం నేను దేశీయ స్థాయి క్రికెట్పై దృష్టిసారించా. ఒకరకంగా నేను అదృష్టవంతుడిననే చెప్పాలి. దక్షిణాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహించా. దేశం తరఫున ఆడేందుకు అవకాశం రావడమే గొప్ప. ఒకవేళ నా రిటైర్మెంట్ గురించి కొన్ని నెలల కిందట అడిగి ఉంటే సమాధానం వేరేలా చెప్పేవాడిని. అయితే ఇప్పుడు నా ఫ్యామిలీ , నా కెరీర్పై పూర్తి అవగాహనతో ఉన్నా’’ అని స్పష్టం చేశాడు. క్రికెట్ సౌతాఫ్రికా బోర్డుకు ఆటగాళ్లకు మధ్య వివాదంపై స్పందిస్తూ.. సీఎస్ఏ బోర్డుతో మాట్లాడి దాదాపు సంవత్సరం గడిచిందని చెప్పాడు. అసలేం జరుగుతోందనే దానిపై అవగాహన లేదని తెలిపాడు. బయటకు మాత్రం రకరకాల కథనాలు వస్తున్నాయని, అయితే ఇది చాలా సున్నితమైన అంశమని పేర్కొన్నాడు. 2012లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన మోరిస్ దక్షిణాఫ్రికా తరఫున 42 వన్డేలు, 23 టీ20లు, నాలుగు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. తన చివరి మ్యాచ్ను 2019 ప్రపంచకప్లో ఆడాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.