Shooting : షూటింగ్ క్రీడపై కచ్చితంగా సానుకూల నిర్ణయం: కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ సీఈవో
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 2022 కామన్వెల్త్ గేమ్స్లో షూటింగ్కు స్థానం లేదు. అయితే 2026 ఎడిషన్లోనూ ఉంటుందో లేదోననే ...
ఇంటర్నెట్ డెస్క్: బర్మింగ్హామ్ వేదికగా జరుగుతోన్న 2022 కామన్వెల్త్ గేమ్స్లో షూటింగ్కు స్థానం లేదు. అయితే 2026 ఎడిషన్లోనూ ఉంటుందో లేదోననే అనుమానం క్రీడాకారుల్లోనూ, అభిమానుల్లో ఉంది. ఈ క్రమంలో షూటింగ్కు తప్పకుండా స్థానం కల్పించేందుకు కృషి చేస్తామని కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (సీజీఎఫ్) సీఈవో కాటీ సాడ్లేర్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు 2026 ఎడిషన్కు సంబంధించి 16 విభాగాల తొలి జాబితాలో పేరును చేర్చలేదని చెప్పారు. కామన్వెల్త్ గేమ్స్లో భారత్ గెలిచిన 503 పతకాల్లో దాదాపు 25 శాతం (135) షూటింగ్లోనే వచ్చాయి. ఈసారి కామన్వెల్త్ గేమ్స్లో షూటింగ్ లేకపోవడం భారత పతక అవకాశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
‘‘ప్రస్తుతం షూటింగ్ క్రీడ పట్ల ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) ప్రక్రియ సాగుతోంది. ప్రస్తుతం జాబితాలో లేని ఆటలకు సంబంధించి అంతర్జాతీయ సమాఖ్యల పరిశీలనకు ప్రతిపాదనలను ఆహ్వానించడం జరిగింది. షూటింగ్పై కచ్చితంగా సానుకూలంగా నిర్ణయం ఉంటుంది. సోషల్ మీడియాలో భారీగా విజ్ఞప్తులు రావడంతో అంతర్జాతీయ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటుంది. సెప్టెంబర్లో సీజీఎఫ్ భేటీలో చర్చించి 2026 తుది జాబితాను ఈ ఏడాది చివరికల్లా వెల్లడిస్తాం’’ అని కాటీ వివరించారు. మూడు రోజుల కిందట సీజీఎఫ్ వార్షిక సమావేశం సందర్భంగా ప్రెసిడెంట్ డామే లూయిజ్ మార్టిన్ను భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) అధ్యక్షుడు అనిల్ ఖన్నా, ఐవోఏ ట్రెజరర్ ఆనందేశ్వర్ పాండే కలిశారు. ఈ సందర్భంగా 2026 తుది జాబితాలో రెజ్లింగ్, షూటింగ్ను తప్పకుండా చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ