IPL 2022: పూర్తి ఐపీఎల్‌ మహారాష్ట్రలో?

దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌ నిర్వహణపై బీసీసీఐ ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తోంది. ఈసారి ఐపీఎల్‌ను పూర్తిగా మహారాష్ట్రలో నిర్వహించడంపై సాధ్యాసాధ్యాల్ని...

Updated : 11 Jan 2022 08:17 IST

ముంబయి: దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌ నిర్వహణపై బీసీసీఐ ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తోంది. ఈసారి ఐపీఎల్‌ను పూర్తిగా మహారాష్ట్రలో నిర్వహించడంపై సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తోంది. ముంబయిలోని వాంఖడే, బ్రబోర్న్‌, డీవై పాటిల్‌.. పుణెలోని ఎంసీఏ స్టేడియాల్లో ఐపీఎల్‌ నిర్వహణపై కసరత్తులు చేస్తోంది. ‘‘ఈనెల 5న బీసీసీఐ తాత్కాలిక సీఈఓ, ఐపీఎల్‌ సీఓఓ హేమాంగ్‌ అమిన్‌.. ముంబయి క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడు విజయ్‌ పాటిల్‌ను సంప్రదించాడు. కొన్ని రోజుల అనంతరం ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ను అమిన్‌, పాటిల్‌ కలిశారు. బీసీసీఐ ప్రతిపాదనకు పవార్‌ పచ్చజెండా ఊపాడు. రానున్న వారం, పది రోజుల్లో బీసీసీఐ.. ఎంసీఏ అధికారులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేబాశిష్‌ చక్రవర్తిలను కలిసి ఐపీఎల్‌ నిర్వహణకు కావాల్సిన అనుమతులు కోరతారు. ప్రేక్షకులు లేకుండా కఠినమైన బయో బబుల్‌లో లీగ్‌ జరుగుతుంది కాబట్టి ఎలాంటి సమస్యలు రావు. ప్రస్తుతానికి ఐపీఎల్‌ను భారత్‌లోనే నిర్వహించాలన్నది బోర్డు ప్రణాళిక. భవిష్యత్తులో మహారాష్ట్ర వేదిక కూడా కుదరకపోతే ఐపీఎల్‌ను యూఏఈకి తరలించడం మినహా మరో మార్గం లేదు’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని