Cricket Australia : రెండు నెలల తర్వాత జస్టిన్ లాంగర్ స్థానంలో ఆసీస్కు కొత్త కోచ్
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ వచ్చేశాడు. దాదాపు రెండు నెలల తర్వాత ...
ఆండ్రూ మెక్డొనాల్డ్ను నియమించిన సీఏ
ఇంటర్నెట్ డెస్క్ : ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ వచ్చేశాడు. దాదాపు రెండు నెలల తర్వాత ఆండ్రూ మెక్డొనాల్డ్ను ప్రధాన కోచ్గా నియమిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల కాలపరిమితితో మెక్డొనాల్డ్ను నియమించింది. ‘‘కోచ్గా అవకాశం కల్పించిన ఆసీస్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు. ఇది నాకు లభించిన అతిపెద్ద గౌరవం. ప్రస్తుత జట్టులో ఉన్న అనుభవాన్ని వినియోగించుకుని పటిష్ఠంగా తయారు చేయడమే నా ముందున్న కర్తవ్యం. అదే ప్రణాళికతో వస్తున్నా. జట్టుగా పని చేసేందుకు ఎదురు చూస్తున్నా’’ అని మెక్డొనాల్డ్ తెలిపాడు.
గత యాషెస్ సిరీస్ తర్వాత అప్పటి వరకు కోచ్గా బాధ్యతలు నిర్వర్తించిన జస్టిన్ లాంగర్ పదవీ కాలాన్ని కేవలం ఆరు నెలలే క్రికెట్ ఆస్ట్రేలియా పొడిగించింది. అయితే మరోసారి నాలుగేళ్ల కాంట్రాక్ట్ దక్కుతుందని ఆశించిన లాంగర్కు భంగపాటు తప్పలేదు. దీంతో పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. లాంగర్ 2018లో ఆసీస్ జట్టు కోచింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. ఆ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత కోచ్గా నియమితుడయ్యాడు. ఈ క్రమంలోనే ఆసీస్ రెండు సార్లు భారత్ చేతిలో బోర్డర్-గావస్కర్ సిరీస్లు కోల్పోయింది. అయితే, ఇటీవల టీ20 ప్రపంచకప్ గెలవడం, ఇంగ్లాండ్పై యాషెస్ సిరీస్ గెలవడం విశేషం. సీనియర్ ఆటగాళ్ల నుంచి మద్దతు లభించకపోవడంతో లాంగర్ కాంట్రాక్ట్ను నాలుగేళ్లకు పెంచేందుకు సీఏ నిరాకరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.