WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత.. ‘ఏఐ’ ఏం చెప్పిందంటే..?
డబ్ల్యూటీసీ ఫైనల్లో (WTC Final 2023) విజేతగా నిలిచే జట్టు గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికీ తొలి రోజు ఆట మాత్రమే ముగిసింది. ఇవాళ రెండో రోజు ఆట ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్లోని ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా, భారత్ జట్ల (AUS vs IND) మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో (WTC Final 2023) విజేత ఎవరు..? ఇప్పుడు కేవలం తొలి రోజు ఆట మాత్రమే ముగిసింది. అయినా, ప్రారంభం నుంచే ఏ జట్టు గెలుస్తుందనే అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కూడా అంచనా వేసి వెల్లడించింది. మరి ‘ఏఐ’ ఏం చెప్పిందో ఆసీస్ క్రికెటర్ల మాటల్లోనే తెలుసుకుందాం.. ఆ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తన యూట్యూబ్ ఛానెల్లో పోస్టు చేసింది. ‘‘మేం డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అడిగాం. ఆ ఫలితం చాలా ఆసక్తికరంగా ఉంది. అదేంటో మీరూ చూసేయండి’’ అని సీఏ పేర్కొంది. ఆ వీడియోలో.. ఏఐ ఫలితాలను ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్వుడ్, నాథన్ లైయన్ చదివి వినిపించారు.
‘‘ఆస్ట్రేలియా, భారత్ ఉత్కంఠభరితంగా పోరాడతాయి. అయితే, ఆసీస్ భారీ టార్గెట్ను ఛేదించి విజేతగా నిలుస్తుంది. బ్యాటింగ్ ఆర్డర్ రివర్స్ అవుతుంది. పోటీని మరింత రసవత్తరంగా మారుస్తుంది’’ - ప్యాట్ కమిన్స్
‘‘జోష్ హేజిల్వుడ్, నాథన్ లైయన్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. హేజిల్ కొన్ని అద్భుతమైన షాట్లు ఆడతాడు. ఛేదనను మరింత సులువు చేస్తాడు. భారత బౌలర్లు మాత్రం తమ రిథమ్ను అందిపుచ్చుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడతారు’’ - హేజిల్వుడ్
‘‘ప్యాట్ కమిన్స్ మూడో స్థానంలో బ్యాటింగ్కు వస్తాడు. దూకుడైన ఆటతీరుతో ఆసీస్ శిబిరంలో భరోసా కల్పిస్తాడు. ప్రతి షాట్తో మ్యాచ్ను దగ్గరగా తీసుకొస్తాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సందర్భంలో.. భారత బౌలర్ వేసిన ఫుల్టాస్ను ఆకాశమే హద్దుగా బాదేస్తాడు’’ - కమిన్స్
‘‘ఓవల్ మైదానం అదిరిపోయింది’’ - నాథన్ లైయన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి