IND vs NZ: శ్రేయస్ అయ్యర్పై దిగ్గజ క్రికెటర్ల ప్రశంసల వర్షం.!
టీమ్ఇండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అరంగేట్ర టెస్టులోనే శతకం నమోదు చేయడంపై పలువురు దిగ్గజ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్..
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అరంగేట్ర టెస్టులోనే శతకం నమోదు చేయడంపై పలువురు దిగ్గజ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ సహా.. కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు శ్రేయస్ అయ్యర్ ఆటతీరును మెచ్చుకుంటూ సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు తెలిపారు. కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతోన్న తొలి టెస్టు సందర్భంగా అయ్యర్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఆడుతున్న తొలి టెస్టులోనే శ్రేయస్ (105: 171 బంతుల్లో 13x4, 2x6) శతకంతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
‘టెస్టు కెరీర్ను గొప్పగా ప్రారంభించావు శ్రేయస్ అయ్యర్. టీమ్ఇండియా టెస్టు క్రికెట్లో నువ్వు భాగమైనందుకు సంతోషంగా ఉంది’ - సచిన్ తెందూల్కర్
‘శ్రేయస్.. చాలా బాగా ఆడావు. అరంగేట్ర టెస్టులోనే శతకంతో ఆకట్టుకున్నావు’ - విరాట్ కోహ్లి
‘టెస్టు కెరీర్ను చాలా ఘనంగా ప్రారంభించావు శ్రేయస్’ - రోహిత్ శర్మ
‘తీవ్ర ఒత్తిడిలో కూడా చాలా బాగా ఆడావు శ్రేయస్. నిలకడగా ఆడుతూ గొప్ప పరిణతి చూపించావు. అరంగేట్ర టెస్టులోనే శతకం చేసిన 16వ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కావు. ఇలాంటి శతకాలు ఇంకెన్నో సాధించాలి’ - వీవీఎస్ లక్ష్మణ్
‘క్లిష్ట పరిస్థితుల్లోనూ శతకంతో ఆకట్టుకున్నావు శ్రేయస్’ - ఇర్ఫాన్ పఠాన్
మరో వైపు, రెండో రోజు 258/4 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ని ఆరంభించిన టీమ్ఇండియా 345 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ రెండో రోజు ఆట ముగిసే సరికి 129/0 స్కోరుతో నిలిచింది.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.