ఇటలీ విజేతలకు సచిన్‌ సహా క్రికెటర్ల అభినందనలు

ఉత్కంఠగా సాగిన యూరోకప్‌ 2020 ఫైనల్లో బలమైన ఇంగ్లాండ్‌పై ఇటలీ విజయం సాధించడంతో పలువురు క్రికెటర్లు ఆ జట్టుకు అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తూ ఓడినా ఇంగ్లాండ్‌ బాగా ఆడిందని...

Updated : 12 Jul 2021 16:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్కంఠగా సాగిన యూరోకప్‌ 2020 ఫైనల్లో బలమైన ఇంగ్లాండ్‌పై ఇటలీ విజయం సాధించడంతో పలువురు క్రికెటర్లు ఆ జట్టుకు అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తూ ఓడినా ఇంగ్లాండ్‌ బాగా ఆడిందని మెచ్చుకున్నారు. అలాగే గెలిచినందుకు ఇటలీకి కంగ్రాట్స్‌ చెబుతున్నారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌, ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌, పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌తో పాటు పలువురు ఈతరం క్రికెటర్లు సైతం యూరోకప్‌ ఫైనల్‌పై ట్వీట్లు చేశారు.

తొలుత మ్యాచ్‌ ప్రారంభమైన ఆదిలోనే ఇంగ్లాండ్‌ ఆటగాడు లుక్‌ షా గోల్‌ సాధించడంతో ఆ జట్టు తొలిభాగంలో పైచేయి సాధించింది. ఇక రెండో భాగంలో ఇటలీ డిఫెండర్‌ లియోనార్డో బానుస్సి 67వ నిమిషంలో గోల్‌ చేసి స్కోర్లు సమం చేశాడు. తర్వాత ఇరు జట్లూ మరో గోల్‌ చేయకపోవడంతో మ్యాచ్‌ అదనపు సమయానికి చేరింది. ఆపై పెనాల్టీస్‌ షూటౌట్‌కు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ దూకుడు ప్రదర్శించిన ఇటలీ 3-2 తేడాతో ఇంగ్లిష్‌ జట్టును ఓడించింది. దాంతో ఇంగ్లాండ్‌ నిరాశతో వెనుదిరిగింది.







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని