Kohli 100th Test : విరాట్.. వందలో వంద కొట్టి వారి సరసన నిలవాలి: గావస్కర్
టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ వందో టెస్టు మ్యాచ్ కోసం..
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ వందో టెస్టు మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శుక్రవారం నుంచి శ్రీలంకతో జరగబోయే మ్యాచ్పైనే అందరి దృష్టి నెలకొంది. ఈ వందో టెస్టు మ్యాచ్లో.. విరాట్ కోహ్లీ ప్రత్యేక బ్యాటింగ్ ప్రదర్శన ఉంటుందని భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా 38 పరుగులు చేసి ఎనిమిది వేల పరుగులు చేసిన బ్యాటర్గానూ అవతరిస్తాడని చెప్పాడు. ‘‘వందో టెస్టు మ్యాచ్లో విరాట్ కోహ్లీ శతకం చేస్తాడని ఆశిస్తున్నా. ఇప్పటి వరకు చాలామంది క్రికెటర్లు ఆ ఫీట్ను అందుకోలేదు. నాకు తెలిసి కొలిన్ కౌడ్రే, జావెద్ మియాందాద్, అలెక్స్ స్టీవర్ట్, ఇంజమామ్, రూట్ శతకాలను బాదారు’’ అని గావస్కర్ పేర్కొన్నాడు.
రెండేళ్ల నుంచి సెంచరీ కొట్టలేదనే వాదనపైనా సునిల్ గావస్కర్ స్పందిస్తూ.. ‘‘లక్ష్యం అందుకోవాలనే తపన ఉండాలి. చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటాం. సక్సెస్ వచ్చినప్పుడు దానిని నిలబెట్టుకోవడం కోసం ప్రతి సంవత్సరం కష్టపడతాం. ఇప్పుడు విరాట్ కోహ్లీకి వందో టెస్టు కూడా అలాంటిదే’’ అని గావస్కర్ వివరించాడు. మొహాలీ టెస్టు మ్యాచ్కు 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకులకు అనుమతి లేకుండానే నిర్వహించేందుకు తొలుత నిర్ణయించినా.. అభిమానుల నుంచి విమర్శలు రావడంతో మార్పులు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?