Prithvi Shaw: ‘సెల్ఫీ’ దాడి ఘటన.. పృథ్వీ షా కెరీర్లో వివాదాలెన్నో..!
అండర్-19 ప్రపంచకప్ విజేత జట్టు కెప్టెన్, యువ ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw) తాజాగా సెల్ఫీ వివాదంలో చిక్కుకున్నాడు. సెల్ఫీ మోజులో కొందరు అతడిపై దాడి చేయడం దుమారం రేపింది. అయితే పృథ్వీ గతంలోనూ పలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా (Team India) జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న యువ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) వార్తల్లో నిలిచాడు. సెల్ఫీ మోజులో కొందరు వ్యక్తులు అతడిపై దాడికి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. పృథ్వీ సెల్ఫీ నిరాకరించడంతో అతడితో దురుసుగా ప్రవర్తించడమే కాక, స్నేహితుడి కారును ధ్వంసం చేశారు. క్రికెటర్ నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, పృథ్వీనే మద్యం మత్తులో తమపై దాడికి దిగాడని నిందితులు ఆరోపించడం గమనార్హం. దీంతో ఈ ఘటన వివాదాస్పదమైంది.
అయితే, ఈ అండర్-19 (Under 19) ప్రపంచకప్ విజేత జట్టు కెప్టెన్ ఇలా వార్తల్లో నిలవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అనేకసార్లు పలు వివాదాల్లో చిక్కుకున్నాడు.
డోపింగ్తో సస్పెండ్కు గురై..
నాలుగేళ్ల క్రితం పృథ్వీ షా (Prithvi Shaw) డోపింగ్ టెస్టులో పట్టుబడి 8 నెలల పాటు నిషేధానికి గురయ్యాడు. 2019 ఫిబ్రవరిలో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సమయంలో యాంటీ డోపింగ్ టెస్టింగ్ ప్రొగ్రామ్లో భాగంగా పృథ్వీ శాంపిళ్లను పరీక్షించారు. అందులో అతడు నిషేధిత డ్రగ్ తీసుకున్నట్లు తేలడంతో 2019 మార్చి నుంచి నవంబరు వరకు 8 నెలల పాటు పృథ్వీని సస్పెండ్ చేశారు. అయితే ఆ తర్వాత పృథ్వీ దానిపై వివరణ ఇచ్చాడు. ట్రోఫీ సమయంలో జలుబు, దగ్గుతో బాధపడటంతో మార్కెట్లో దొరికే దగ్గు మందు తీసుకున్నానని, ఆ తర్వాతి రోజే డోపింగ్ టెస్టు నిర్వహించడంతో తనకు పాజిటివ్ వచ్చిందని తెలిపాడు. ఫిజియోను సంప్రదించకుండా నిషేధించిన ఆ డ్రగ్ ఉన్న దగ్గు మందు తీసుకోవడమే తాను చేసిన తప్పని చెప్పాడు.
యో-యో టెస్టులో విఫలమై..
2022 ఐపీఎల్ టోర్నీకి ముందు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఆటగాళ్లకు యో-యో టెస్టు నిర్వహించగా.. అందులో పృథ్వీ షా (Prithvi Shaw) విఫలమయ్యాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఈ టెస్టులో పురుష క్రికెటర్లు 16.5 స్కోరు సాధించాల్సి ఉండగా.. పృధ్వీ షా స్కోరు 15 కంటే తక్కువే వచ్చినట్లు వార్తలు రావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో పృథ్వీ స్పందిస్తూ.. ‘‘నా పరిస్థితి మీకు తెలియనప్పుడు నా గురించి ఓ అంచనాకు రావడం సరికాదు’’ అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు.
నెట్స్లో బ్యాటింగ్ వద్దని..
2021లో దిల్లీ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్.. పృథ్వీ షా (Prithvi Shaw)పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2020 ఐపీఎల్ సీజన్లో అతడు నెట్స్లో సాధన చేసేందుకు ఇష్టపడటం లేదని వ్యాఖ్యానించాడు. ‘‘ఆ ఐపీఎల్ సమయంలో అతడు (పృథ్వీ షా) సరిగా పరుగులు చేయలేకపోయాడు. నాలుగైదు మ్యాచుల్లో 10 కంటే తక్కువ స్కోరే చేశాడు. అప్పుడు నెట్స్లో వర్కౌట్ చేస్తే రాణిస్తావని నేను చెప్పాను. దానికి అతడు నా కళ్లల్లోకి చూస్తూ.. ‘నేను ఈ రోజు బ్యాటింగ్ చేయట్లేదు. వర్కౌట్ చేయాల్సిన అవసరం ఏముంది’ అని అన్నాడు’ అంటూ పాటింగ్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం అప్పట్లో వివాదాస్పదమైంది.
2018లో జరిగిన అండర్ 19 ప్రపంచకప్ (Worldcup) టోర్నీలో పృథ్వీ షా నేతృత్వంలోని భారత జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పృథ్వీ షా కెరీర్ మలుపు తిరిగింది. అయితే, దేశవాళీ మ్యాచ్ల్లో రాణిస్తున్నప్పటికీ.. టీమ్ఇండియా జట్టులో ఆడేందుకు అతడికి అవకాశాలు కలిసి రావట్లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు. -
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) బర్త్ డే సందర్భంగా పెద్దఎత్తున శుభాకాంక్షలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా పోస్టులు పెట్టారు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్