Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ(DhanaShree Verma) సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో.....
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ(DhanaShree Verma) సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో ఆ రొమాంటిక్ జంట విడిపోతోందేమోనన్న గందరగోళంపై చాహల్ స్పందించాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టిన పోస్ట్తో విడాకుల చర్చకు ఫుల్స్టాప్ పెట్టాడు. అవన్నీ రూమర్లేనని.. ఎవరూ నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ‘‘మా రిలేషన్షిప్కు సంబంధించి ఎలాంటి రూమర్లూ నమ్మొద్దని మీ అందరికీ వినమ్రతతో విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి వీటికి ముగింపు పలకండి’’ అని చాహల్ కోరాడు.
యుజువేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ జంటకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ను అభిమానులతో షేర్ చేసుకుంటూ రొమాంటిక్ జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా వీరు సోషల్మీడియాలో పెట్టిన పోస్టులు అభిమానులను గందరగోళానికి గురిచేసి కొత్త చర్చకు దారి తీశాయి. దీంతో చాహల్, ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారేమోనన్న వార్తలు గుప్పుమనడంతో తాజాగా చాహల్ స్పందించాడు.
అసలేం జరిగిందంటే..
చాహల్ బుధవారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. అందులో ‘కొత్త జీవితం మొదలవుతోంది (New Life Loading..)’ అని రాసి ఉంది. దీంతో ఈ ఫొటో నెట్టింట వైరల్గా మారింది. ధనశ్రీ తల్లికాబోతుందేమో.. చాహల్ త్వరలోనే శుభవార్త చెప్పనున్నారంటూ అభిమానులు భావించారు. అయితే అదే సమయంలో చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ తన ఇన్స్టాగ్రామ్లో చాహల్ పేరును తొలగించడంతో కొంత గందరగోళం మొదలైంది.
పెళ్లి తర్వాత ధనశ్రీ వర్మ చాహల్గా ఉన్న పేరును ఇప్పుడు ఆమె ధనశ్రీ వర్మగా మార్చుకుంది. నిజానికి చాహల్ పోస్ట్ కంటే ముందే ఆమె తన పేరులో నుంచి చాహల్ పదాన్ని తొలగించుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాక, నిన్న ఆమె ఓ ఫొటోను షేర్ చేస్తూ ‘‘యువరాణి తన బాధను కూడా శక్తిగా మార్చుకుంటుంది’’ అని రాసుకొచ్చింది. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. చాహల్ జంట మధ్య బంధం సరిగా లేదంటూ వార్తలు గుప్పుమన్నాయి. వీరిద్దరూ డిసెంబర్ 2020లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.
ముంబయికి చెందిన డెంటిస్ట్, కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వద్ద చాహల్ డ్యాన్స్ క్లాసులకు వెళ్లాడు. ఆ పరిచయం ప్రేమగా మారి 2020 డిసెంబరులో వీరిద్దరూ గురుగ్రామ్లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇటీవల జరిగిన టీ20 మెగా టోర్నీలోనూ చాహల్ ఆడే మ్యాచ్లకు ధనశ్రీ వచ్చి గ్యాలరీ నుంచి ఉత్సాహపర్చింది. ఆ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్మీడియాలో షేర్ చేసింది కూడా. అయితే కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇక, కెరీర్ పరంగా చాహల్ త్వరలోనే ఆసియా కప్ 2022 టోర్నీలో ఆడనున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
WPL 2024 - RCB: డబ్ల్యూపీఎల్ విజేతగా ఆర్సీబీ.. పురుషుల జట్టుపై నెట్టింట మీమ్స్!
ఆర్సీబీ మహిళా జట్టు విజేతగా నిలవడంతో పురుష టీమ్పై సోషల్ మీడియాలో కామెంట్లు ఎక్కువయ్యాయి. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఛాంపియన్గా ఆర్సీబీ నిలిచింది. -
WPL 2024: ఈ కప్ వారి కోసమే.. మాటలు రావడం లేదు: స్మృతి మంధాన
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించి ఛాంపియన్గా నిలిచింది. -
IPL 2024: గిల్ కెప్టెన్గా సక్సెస్ అవుతాడు.. మేం అండగా ఉంటాం: గ్యారీ కిర్స్టెన్
కొత్త సారథి నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ ఈసారి ఐపీఎల్ (IPL 2024) బరిలోకి దిగింది. తొలి మ్యాచ్లో హార్దిక్ కెప్టెన్సీలోని ముంబయి ఇండియన్స్తో తలపడనుండటం గమనార్హం. గత రెండు సీజన్లలో హార్దిక్ గుజరాత్ను నడిపించిన సంగతి తెలిసిందే. -
Mohammad Kaif: వాళ్లిద్దరి జోక్యం వల్లే భారత్ ఓటమి
పిచ్ విషయంలో కెప్టెన్ రోహిత్శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ జోక్యమే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమికి కారణమని టీమ్ఇండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అన్నాడు. -
బెంగళూరుకు ఓ కప్పు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. -
బెంగ తీరింది
ఈ సాలా కప్ నమదే! అవును.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధించింది. కల లాంటి కప్ను దక్కించుకుంది. -
ఈసారి తేలిక కాదు!
ఐపీఎల్లో గుజరాత్ అరంగేట్రమే పెను సంచలనం. లఖ్నవూతో పాటు 2022లో టోర్నీలో అడుగుపెట్టిన ఆ జట్టు.. తొలి సీజన్లోనే విజేతగా నిలిచి ఔరా అనిపించింది. -
5 రోజుల్లో తిరిగొస్తానని చెప్పా
నిరుడు ప్రపంచకప్లో బంగ్లాదేశ్తో మ్యాచ్ నుంచి గాయం కారణంగా అర్ధంతరంగా వైదొలిగిన భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య.. అప్పుడు అయిదు రోజుల్లోనే జట్టులోకి తిరిగొస్తానని టీమ్ఇండియా మేనేజ్మెంట్కు మాటిచ్చాడట. -
స్వదేశానికి కోహ్లి
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి స్వదేశానికి చేరుకున్నాడు. కుమారుడు అకాయ్ పుట్టిన తర్వాత తొలిసారిగా కోహ్లి ఆదివారం భారత్కు తిరిగొచ్చాడు. -
కోహ్లి కావాల్సిందేనన్న రోహిత్!
ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో విరాట్ కోహ్లి ఉండాల్సిందేనని బీసీసీఐ కార్యదర్శి జై షాకు కెప్టెన్ రోహిత్ తేల్చిచెప్పినట్లు మాజీ ఆల్రౌండర్ కీర్తి ఆజాద్ పేర్కొనడం సంచలనంగా మారింది. -
పాక్ కోచ్ పదవికి వాట్సన్ తిరస్కారం
పాకిస్థాన్ జట్టు చీఫ్ కోచ్ పదవిని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ తిరస్కరించినట్లు సమాచారం. -
Kuldeep Yadav: మైదానంలో రోహిత్ ఏమన్నా మేం బాధపడం: కుల్దీప్ యాదవ్
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలో దురుసుగా ఉంటాడనే కామెంట్లను కుల్దీప్ యాదవ్ కొట్టిపడేశాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్దే చోరీ.. తర్వాత సీన్ రివర్స్!
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
AP Congress: ఈ నెల 25న కాంగ్రెస్ జాబితా.. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల..?
-
Bill Gates: ఆ స్థాయిని నేను ఎప్పటికీ అందుకోలేను: బిల్ గేట్స్
-
PM Modi: భారాస తెలంగాణను దోచుకుంది.. కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుంది: జగిత్యాల సభలో మోదీ
-
WPL 2024 - RCB: డబ్ల్యూపీఎల్ విజేతగా ఆర్సీబీ.. పురుషుల జట్టుపై నెట్టింట మీమ్స్!