Mohammed Siraj : అప్పుడు రూమ్లో కూర్చొని ఏడ్చేవాడిని: సిరాజ్
భారత్ తరఫున టెస్టుల్లో ప్రాతినిధ్యం వహిస్తే చూడాలని తన తండ్రి కోరుకున్నాడని యువ పేసర్ సిరాజ్ (Siraj) తెలిపాడు. ఆ కల కోసమే తండ్రి చనిపోయినా తాను స్వదేశానికి రాకుండా ఆసీస్లోనే ఉండిపోయానంటూ నాటి రోజుల్ని గుర్తుచేసుకున్నాడు.
ఇంటర్నెట్డెస్క్ : టీమ్ఇండియా యువ పేసర్ మహమ్మద్ సిరాజ్(Mohammed Siraj) భావోద్వేగానికి గురయ్యాడు. తన తండ్రి చనిపోయినప్పుడు.. తాను ఎదుర్కొన్న పరిస్థితులను మరోసారి గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్(IPL)లో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరాజ్.. ఆర్సీబీ(RCB) సీజన్ 2 పాడ్కాస్ట్లో మాట్లాడాడు. నేడు తన పుట్టిన రోజు సందర్భంగా పలు విషయాలను పంచుకున్నాడు.
2020 నవంబర్లో సిరాజ్ ఆస్ట్రేలియా(Australia) పర్యటనలో ఉన్నప్పుడు అతడి తండ్రి మరణించిన విషయం తెలిసిందే. అయితే కొవిడ్ బయోబబుల్లో ఉండటంతో.. అతడు తండ్రి అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేకపోయాడు. కన్న తండ్రి చివరి చూపు కూడా దక్కకపోవడంతో తాను ఎన్నోసార్లు ఒంటరిగా రూమ్లో కూర్చుని ఏడ్చానని సిరాజ్ చెప్పాడు. ‘‘క్వారంటైన్ నిబంధనలు ఉండటంతో ఆటగాళ్లు ఒకరి రూమ్లోకి మరొకరు వచ్చేవారు కాదు. వీడియో కాల్స్లోనే మాట్లాడుకునే వాళ్లం. ఆ పరిస్థితుల్లో అప్పటి ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ నాకు ఫోన్ చేసి.. ఎలా ఉన్నావంటూ అడిగేవాడు. నాకు కాబోయే భార్య కూడా నాతో ఫోన్లో మాట్లాడుతూ అండగా నిలిచింది. అయితే.. ఫోన్లో ఎప్పుడూ నేను ఏడవలేదు. రూమ్లో ఒంటరిగా కూర్చుని ఏడ్చేవాడిని. ఆ తర్వాత ఆమెతో మాట్లాడేవాడిని’’ అంటూ ఆనాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నాడు సిరాజ్.
‘‘తండ్రి చనిపోయిన తర్వాతి రోజే నేను ట్రైనింగ్ సెషన్కు వెళ్లాను. ఆ సమయంలో రవిశాస్త్రి నాకు ధైర్యం చెప్పారు. ‘నీకు నీ తండ్రి ఆశీస్సులు ఉన్నాయి. నువ్వు ఐదు వికెట్లు తీసుకుంటావు’ అని చెప్పాడు. బ్రిస్బేన్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేయగానే.. శాస్త్రి నా వద్దకు వచ్చి.. ముందే చెప్పానుగా.. అని అన్నాడు’’ అంటూ సిరాజ్.. తనకు రవిశాస్త్రి అండగా ఉన్న క్షణాలను వివరించాడు.
క్రికెట్ ఆడే సమయంలో తన తండ్రితో గడిపిన క్షణాలను తాను ఎప్పటికీ మరిచిపోనని.. తానో గొప్ప క్రికెటర్ కావాలని ఆయన ఎప్పుడూ కోరుకునేవారని సిరాజ్ చెప్పాడు. ‘‘నేను ఆస్ట్రేలియాలో బౌలింగ్ చేయడాన్ని ఎంతో ఆస్వాదించాను. ఎందుకంటే.. ప్రధాన బౌలర్లంతా గాయపడటంతో.. నేను పేస్ అటాక్లో లీడర్గా మారాను. కొత్త బంతితో బౌలింగ్ చేయడం భిన్నమైన అనుభూతి కలిగించింది’ అని సిరాజ్ వివరించాడు. ఆ ఏడాది బాక్సింగ్ డే టెస్టుతో సిరాజ్ సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్లో ఈ పేసర్ సత్తా చాటాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంకెంతకాలం విరాట్ ఒక్కడే ఆడాలి.. మీరేం చేస్తున్నారు?: గావస్కర్
విరాట్ కోహ్లీ ఒక్కడిపైనే బ్యాటింగ్ భారం మోపడం సరైంది కాదని.. మిగతా వారూ సహకరిస్తే బెంగళూరు పరిస్థితి విభిన్నంగా ఉంటుందని సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. -
బెంచ్పై ఉంచితే పరుగులు చేస్తాడా..? పృథ్వీషాకు అవకాశాలు ఇవ్వాలి: మాజీలు
కీలకమైనా ఆటగాడిని పక్కన పెట్టడం ఎందుకో దిల్లీ మేనేజ్మెంట్ చెబితే బాగుంటుందని మాజీ క్రికెటర్లు ప్రశ్నించారు. పృథ్వీషాను ఆడించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. -
ఈ సీజన్లో తొలి జట్టుగా కోల్కతా.. ‘500’ క్లబ్లోకి సునీల్ నరైన్
ఈ సీజన్లో బెంగళూరుకు రెండో ఓటమి ఎదురైంది. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా చేతిలో పరాజయంపాలైంది. -
ఆర్సీబీ.. ఉఫ్
సన్రైజర్స్పై ఆండ్రి రసెల్ విధ్వంసక ఇన్నింగ్స్ చూశాక.. తర్వాతి మ్యాచ్లో బ్యాటింగ్కు బాగా సహకరించే చిన్నస్వామి స్టేడియంలో, బలహీనంగా కనిపిస్తున్న ఆర్సీబీ బౌలింగ్ను అతనెలా ఉతికారేస్తాడో అని ఆర్సీబీ అభిమానులు కంగారు పడ్డారు! కానీ శుక్రవారం రసెల్ బ్యాటందుకోవాల్సిన అవసరమే పడలేదు. -
పరాగ్ పట్టుదలతో
ఆ యువ ఆటగాడు మైదానంలో కనిపిస్తే చాలు ఎగతాళి.. అంచనాలు అందుకోవడం లేదంటూ విమర్శలు.. నిలకడ లేదనే వ్యాఖ్యలు.. అంతర్జాలంలో దూషణలు.. ఇలా ఎంతో వ్యతిరేకత! కానీ ఆ కుర్రాడు కుంగిపోలేదు. పట్టుదలతో సాగుతున్నాడు. -
హార్దిక్.. అవి పట్టించుకోవద్దు!
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా నియమితుడైన హార్దిక్ పాండ్యకు ఐపీఎల్ మ్యాచ్ల కోసం వెళ్లిన ప్రతి వేదికలోనూ ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత తప్పట్లేదు. -
ఇదే నా అత్యుత్తమ చివరి ఓవర్
ఇప్పటిదాకా తాను వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో గురువారం రాత్రి దిల్లీ క్యాపిటల్స్ మీద వేసిందే ఉత్తమమైందని రాజస్థాన్ రాయల్స్ పేసర్ అవేష్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. -
కోహ్లి, గంభీర్ నవ్వుల్ నవ్వుల్..
ఐపీఎల్లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య వైరం తెలిసిందే. నిరుడు లఖ్నవూ సూపర్ జెయింట్స్ మెంటార్గా గంభీర్ ఉన్న సమయంలో.. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా మైదానంలో ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగిన విషయం విదితమే. -
పోరాడి ఓడిన సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో శుక్రవారం భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మిక్స్డ్ డబుల్స్లో దంపతులు సిక్కిరెడ్డి- సుమీత్ రెడ్డి సెమీస్ చేరారు. -
అమెరికా జట్టులో కివీస్ ఆల్రౌండర్
కోరీ అండర్సన్ గుర్తున్నాడా? ఒకప్పుడు 36 బంతుల్లోనే సెంచరీ చేసి వన్డేల్లో అత్యంత వేగవంతమైన శతక రికార్డును నెలకొల్పిన న్యూజిలాండ్ ఆటగాడు. -
ఫైనల్లో బోపన్న జోడీ
వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని ఆటతీరుతో అదరగొడుతున్న భారత వెటరన్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న మరో డబుల్స్ టైటిల్కు చేరువయ్యాడు. -
పంత్ త్వరలోనే ప్రత్యేకంగా..
మధ్య ఓవర్లలో రిషబ్ పంత్ ఎలా ఆడతాడన్న దానిపై దిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన ఆధారపడిందని ఆ జట్టు బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ పేర్కొన్నాడు.