Cristiano Ronaldo: రొనాల్డోకు కాసుల పంట.. రూ.4400కోట్లకు సౌదీ క్లబ్తో డీల్
మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్తో బంధాన్ని తెంచుకున్న ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో.. తన కెరీర్లోనే అత్యంత విలువైన ఒప్పందాన్ని చేసుకున్నాడు. రూ.4400కోట్లకు సౌదీ అరేబియా క్లబ్తో జట్టు కట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఫుట్బాల్ (Football) దిగ్గజం, పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo)ను అదృష్టం గట్టిగా వరించింది. ఇటీవల మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్తో బంధాన్ని తెంచుకున్న అతడు.. ఇప్పుడు మరో క్లబ్తో జట్టు కట్టాడు. సౌదీ అరేబియా (Saudi Arabia)కు చెందిన అల్ నజర్ (Al Nassr) క్లబ్.. రొనాల్డోతో ఏకంగా ఏడాదికి 200 మిలియన్ యూరోలతో ఒప్పందం కుదుర్చుకుంది.
రొనాల్డో తమ జెర్సీని పట్టుకున్న ఫొటోలను అల్ నజర్ ట్విటర్లో పోస్ట్ చేస్తూ అతడికి స్వాగతం పలికింది. ‘‘సరికొత్త చరిత్ర. ఈ డీల్తో మా క్లబ్ అద్భుత విజయాలను సాధించేలా ప్రేరణ పొందడమే గాక.. మా దేశం, మా భవిష్యత్తు తరాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు స్ఫూర్తినిస్తుంది’’ అని అల్ నజర్ రాసుకొచ్చింది. జెర్సీపై రొనాల్డో (Cristiano Ronaldo)కు ఇష్టమైన నంబరు 7 అని ఉంది. సౌదీ క్లబ్తో 2025 జూన్ వరకు రొనాల్డో ఒప్పందం చేసుకున్నాడు.
కెరీర్ చివరి దశలో ఉన్న 37 ఏళ్ల రొనాల్డో.. ఈ ఒప్పందంతో భారీ మొత్తమే జీతంగా పొందనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్తో సౌదీ క్లబ్.. ఈ సాకర్ దిగ్గజానికి ఏడాదికి 200 మిలియన్ యూరోలు.. అంటే మొత్తంగా 500 మిలియన్ యూరోలను (భారత కరెన్సీలో దాదాపు రూ.4400కోట్లకు పైమాటే) చెల్లించనుందట. దీంతో ఫుట్బాల్ చరిత్రలోనే అత్యధిక ధర కలిగిన ఆటగాడిగా రొనాల్డో సరికొత్త రికార్డు సృష్టించనున్నాడు. ఈ డీల్పై రొనాల్డో ప్రకటన విడుదల చేశాడు. ‘‘మరో దేశంలో కొత్త ఫుట్బాల్ లీగ్లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇప్పటికే అనేక లీగ్లు, టోర్నీలను గెలిచాను. ఆసియా ఆటగాళ్లతోనూ నా అనుభవాన్ని పంచుకునేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా’’ అని తెలిపాడు.
ఇటీవల మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్తో రొనాల్డో డీల్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఫిఫా (FIFA) ప్రపంచకప్ 2022 ప్రారంభానికి రెండు రోజుల ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది. ఓ టాక్ షోలో రొనాల్డో.. మాంచెస్టర్ క్లబ్ యాజమాన్యం, మేనేజర్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతడిపై వేటు వేసినట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి. పోర్చుగల్ సీనియర్ జాతీయ జట్టుకు 2003లో ఎంపికైన రొనాల్డో అదే ఏడాది క్లబ్ కెరీర్ను ప్రారంభించాడు. దాదాపు నాలుగేళ్లపాటు మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్కు ఆడాడు. ఆ తర్వాత రియల్ మాడ్రిడ్, జువెంటస్ క్లబ్లకు ప్రాతినిధ్యం వహించాడు. 14 ఏళ్ల తర్వాత 2021లో తిరిగి మాంచెస్టర్ క్లబ్కు వచ్చినప్పటికీ.. ఏడాదికే ఆ బంధం తెగిపోయింది.
కాగా.. ప్రపంచకప్ (FIFA World cup) గెలవాలన్న రొనాల్డో కల ఈసారి కూడా నెరవేరలేదు. ఇటీవల జరిగిన ఫిఫా మెగా టోర్నీలో పోర్చుగల్ జట్టు.. క్వార్టర్స్లో మొరాకో చేతిలో ఓడిపోయింది. ఆ సమయంలో రొనాల్డో కన్నీళ్లతో మైదానాన్ని వీడటం ఫుట్బాల్ అభిమానులను కలిచివేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత