Ronaldo: నేను కప్ అందించినా.. ‘బెస్ట్ ప్లేయర్’పై చర్చ కొనసాగుతుంటుంది: రొనాల్డో
ప్రస్తుతం అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాళ్లలో బాగా పేరొందిన స్టార్లు పోర్చుగల్కు చెందిన క్రిస్టియానో రొనాల్డో, అర్జెంటీనా ప్లేయర్ మెస్సి. తాజాగా ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్లో అందరి కళ్లూ వీరిద్దరి ప్రదర్శనపైనే అనడంలో సందేహం లేదు. అలాగే రొనాల్డో, మెస్సి మధ్యే ఎవరు ఉత్తమ ఆటగాడనే చర్చ జరుగుతుంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడంతా సాకర్ కప్ హంగామా. ఫిఫా నిర్వహించే ఫుట్బాల్ ప్రపంచకప్ అంతర్జాతీయస్థాయిలోనే అత్యంత భారీ టోర్నీ. ఇక భారత్లో స్టార్ ప్లేయర్లు ఎవరంటే భైచుంగ్ భుటియా, సునిల్ ఛెత్రీ పేర్లను చెబుతుంటాం. కానీ అంతర్జాతీయంగా మాజీ దిగ్గజాలు డీగో మారడోనా, పీలే ఫేమస్. ప్రస్తుతం ఉన్నవారిలో మాత్రం క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సి, నెయ్మర్ అని ఫుట్బాల్ అభిమానులు ఠక్కున చెప్తారు. కానీ ఎవరు అత్యుత్తమ ఆటగాడు అని చర్చ మాత్రం రొనాల్డో, మెస్సి మధ్యే జరుగుతుంది. ఈ క్రమంలో పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒక వేళ పోర్చుగల్కు తాను ప్రపంచకప్ అందించినా బెస్ట్ ప్లేయర్ చర్చ కొనసాగుతూనే ఉంటుందని రొనాల్డో పేర్కొన్నాడు.
ఘనాతో గురువారం పోర్చుగల్ తొలి మ్యాచ్లో తలపడనుంది. ఈ క్రమంలో రొనాల్డో ప్రెస్ కాన్ఫెరెన్స్లో మాట్లాడుతూ.. ‘‘ఖతార్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ను పోర్చుగల్కు అందించినా సరే మా ఇద్దరిలో (మెస్సి, రొనాల్డో) ఎవరు ఉత్తమ ఆటగాడనే చర్చ కొనసాగుతూనే ఉంటుంది. నన్ను ఇష్టపడేవాళ్లు నేనే బెస్ట్ ప్లేయర్ అంటారు. మరికొందరు కాదని చెబుతారు. జీవితమంటే ఇలాగే ఉంటుంది. నా జట్టు, నా అభిమానులు, నా కుటుంబం కోసం ఏం చేయగలనో అనేదానిపై దృష్టిసారిస్తా. ప్రతి ఒక్కరికీ అభిప్రాయం ఉంటుంది. దానిని గౌరవించాలి. అలాగే ప్రపంచకప్ను అందించాలనే పట్టుదలతో ఇక్కడికి వచ్చా. ఒకవేళ నా లక్ష్యం నెరవేరకపోయినా కుంగిపోను. నేను సాధించిన లక్ష్యాలకు సంతోషంగానే ఉంటా. చరిత్ర పుస్తకాల్లో అన్ని రికార్డులు ఉంటాయి. అయితే ప్రపంచకప్ను నెగ్గడం కల. దాని కోసం అన్ని శక్తులను ఉపయోగించి తప్పకుండా సాధించేందుకు ప్రయత్నిస్తాం’’ అని వెల్లడించాడు.
ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు మెస్సితో కలిసి చేసిన ఫొటో షూట్పై రొనాల్డో స్పందించాడు. జీవితమంటే చదరంగంలా ఉంటుందని వ్యాఖ్యానించాడు. తప్పకుండా ప్రపంచకప్లో అర్జెంటీనాకు చెక్ చెబుతానని పేర్కొన్నాడు. వీరిద్దరూ చెస్ ఆడుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోర్చుగల్, ఇతర క్లబ్ ఫుట్బాల్ మ్యాచుల్లో కలిపి రొనాల్డో తన కెరీర్లో ఇప్పటి వరకు 817 గోల్స్ సాధించాడు. అలాగే మెస్సి కూడా దాదాపు 785 గోల్స్ కొట్టాడు. ర్యాంకింగ్స్ ప్రకారం మెస్సి టాప్ ర్యాంక్ కాగా.. రొనాల్డో నాలుగో స్థానంలో ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది. -
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
-
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
బేబీ ఫుడ్లో చక్కెర.. వివరణ ఇచ్చిన నెస్లే ఇండియా
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!