Hussey: కరోనా నెగటివ్.. ఆస్ట్రేలియాకు పయనం
ఐపీఎల్ బయోబుడగలో కరోనా వైరస్కు గురైన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైఖేల్ హస్సీ ఆదివారం వేకువజామున స్వదేశానికి తిరిగి బయలుదేరాడు...
ఇంటర్నెట్డెస్క్: ఐపీఎల్ బయోబుడగలో కరోనా బారిన పడిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైఖేల్ హస్సీ ఆదివారం వేకువజామున స్వదేశానికి తిరిగి బయలుదేరాడు. అతడికి ఇటీవల నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో కరోనా నెగిటివ్గా వచ్చిందని, దాంతో ఈరోజు ఉదయం దోహా మీదుగా విమానంలో ఆస్ట్రేలియాకు పయనమయ్యాడని చెన్నై సీఈవో విశ్వనాథన్ పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు.
ఐపీఎల్ 14వ సీజన్లో పలువురు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. దాంతో బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి మే 4న ఈ టోర్నీని నిరవధికంగా వాయిదా వేశారు. అలా పాజిటివ్గా తేలిన వారిలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ హస్సీ, బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ సైతం ఉన్నారు. వీరిద్దరినీ జట్టు నుంచి వేరు చేసి దిల్లీ నుంచి ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్లో చెన్నైకు తరలించారు. దాంతో అక్కడ వైద్యుల పర్యవేక్షణలో క్వారంటైన్లో ఉన్న వీరు తాజాగా కొవిడ్-19 నుంచి కోలుకున్నారు. ఈ క్రమంలోనే అతడు తిరిగి స్వదేశానికి బయలుదేరినట్లు సీఎస్కే సీఈవో వివరించారు. మరోవైపు ఐపీఎల్లో పాల్గొన్న ఇతర ఆస్ట్రేలియా క్రికెటర్లు, సహాయక సిబ్బంది ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్నారు. మే 15 వరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ నుంచి రాకపోకలను నిషేధించిన నేపథ్యంలో వారంతా అక్కడ క్వారంటైన్లో ఉన్నారు. ఇక తాజాగా ఆ గడువు ముగియడంతో భారత్-ఆస్ట్రేలియా దేశాల మధ్య అంతర్జాతీయ ప్రయాణాలు మొదలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.