CWG 2022: అంపైర్ల కిరికిరి ఏంటి..? ఉమెన్స్ హాకీ సెమీఫైనల్లో తప్పిదాలపై నెటిజన్ల ఆగ్రహం
కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా ఉమెన్స్ హాకీ సెమీఫైనల్లో అంపైర్ చేసిన తప్పిదం వివాదానికి దారితీసింది.
తప్పైపోయింది.. మమ్మల్ని క్షమించండి: అంతర్జాతీయ హాకీ సమాఖ్య
ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా ఉమెన్స్ హాకీ సెమీఫైనల్లో అంపైర్ చేసిన తప్పిదం వివాదానికి దారితీసింది. శుక్రవారం ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన పోరులో మ్యాచ్ ముగిసే సమయానికి ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. అయితే, ఇక్కడ అంపైర్ చేసిన తప్పిదం వల్ల భారత్ ఓటమి పాలైంది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయగా, అంతర్జాతీయ హాకీ సమాఖ్య సైతం స్పందించి క్షమించమని కోరింది.
అసలేం ఏం జరిగింది..!
పెనాల్టీ షూటౌట్లో భాగంగా ఆస్ట్రేలియా డిఫెండర్ రోసీ మలోనే షూటౌట్కు సిద్దమైంది. తొలి ప్రయత్నంలో ఆమె షాట్ ఆడగా.. భారత గోల్కీపర్ సవితా ఆస్ట్రేలియాకు గోల్ దక్కకుండా ఆపింది. దీంతో ఆసీస్ ఒక పెనాల్టీ వృథా అయిందని అంతా భావించారు. అయితే, ఈ లోగా అంపైర్ వచ్చి ఆమెను మళ్లీ షూటౌట్ చేయమని కోరింది. ఇదేంటని భారత ఆటగాళ్లు అడిగితే, షూటౌట్ క్లాక్ టైంలో తప్పిదం ఉందని.. అందుకే మళ్లీ ప్రారంభించాలని చెప్పింది. వచ్చిందే అవకాశం అన్నట్లు మలోనే రెండోసారి గురి తప్పలేదు. దీంతో ఆస్ట్రేలియాకు ఆత్మవిశ్వాసం పెరగగా, భారత్ నిరాశ చెందింది. ఆ తరవాత ఆసీస్ వరుసగా మూడు గోల్స్ కొట్టింది. భారత్ మాత్రం ఒక్క గోల్ చేయలేకపోయింది. దీంతో పెనాల్టీ షూటౌట్లో ఆసీస్ చేతిలో భారత్ 3-0 తేడాతో ఓటమిపాలైంది.
సెహ్వాగ్ ఆగ్రహం
ఈ మ్యాచ్లో అంపైర్ల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ గల్లీ మ్యాచ్ కాదని, ఎంతో మంది వీక్షించే పెద్ద ఈవెంట్ అని మర్చిపోయి, క్లాక్టైం మిస్టేక్ అని చెప్పడం ఏంటని నెటిజన్లు సోషల్మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అంపైర్ల పద్ధతిపై టీమ్ఇండియా మాజీ వీరేంద్ర సెహ్వాగ్ ట్విటర్ వేదికగా ఘాటైన ట్వీట్ చేశాడు. ‘ఆసీస్ పెనాల్టీ మిస్ చేయగానే అంపైర్ పరిగెత్తుకొచ్చి.. సారీ క్లాక్ ఇంకా స్టార్ట్ చెయ్యలేదు.. మళ్లీ ఆరంభిద్దామా అని సింపుల్గా చెప్పేసింది. అంపైర్లు ఎందుకు ఇలా చేస్తారో తెలియడం లేదు.క్రికెట్.. హాకీ ఇలా ఏ క్రీడైన అంపైర్లు తమకుండే సూపర్ పవర్తో ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారు. అయితే, అమ్మాయిలు మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది.’ అంటూ క్యాప్షన్ జత చేశాడు.
హాకీ సమాఖ్య క్షమాపణ
మరోవైపు భారత్- ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్పై విమర్శలు ఎక్కువ అవ్వడంతో అంతర్జాతీయ హాకీ సమాఖ్య ట్విటర్ వేదికగా క్షమాపణ కోరింది. 'కామన్వెల్త్ గేమ్స్లో భారత్- ఆస్ట్రేలియా సెమీఫైనల్లో షూటౌట్ సమయంలో చిన్న తప్పిదం వల్ల క్లాక్ సెట్ చేయకముందే షూటౌట్ ప్రారంభమయింది. ఈ తప్పిదానికి జరిగినందుకు మేం క్షమించమని కోరుతున్నాం. ఇలాంటివి భవిష్యత్లో జరగకుండా జాగ్రత్తపడతాం.'' అని ట్వీట్ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు