CWG 2022: నీరజ్ చోప్రా ఒలింపిక్స్ గోల్డ్..మా ఆలోచన విధానాన్నే మార్చేసింది: భారత అథ్లెట్లు
బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు ఎల్దోస్ పాల్, సందీప్ కుమార్, అవినాష్ సాబ్లే లకు మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
ఇంటర్నెట్ డెస్క్: బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు ఎల్దోస్ పాల్, సందీప్ కుమార్, అవినాష్ సాబ్లే లకు మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. భారత అథ్లెటిక్స్ బృందం ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలతో మొత్తం ఎనిమిది పతకాలు సాధించి కామన్వెల్త్ క్రీడల్లో విజయవంతం అయ్యారు. భారత్కు చేరుకొన్నాక లాంగ్ జంప్లో స్వర్ణ పతక విజేత ఎల్దోస్ పాల్ మీడియాతో మాట్లాడాడు. ‘ప్రపంచ ఛాంపియన్షిప్లో మాకు లభించిన అనుభవం ఇక్కడ ఉపయోగపడింది. చాలా గర్వంగా ఉంది. మేము కామన్వెల్త్, ఆసియా క్రీడలకు రెడీ అవుతున్నాము. అయితే, నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్లో గెలిచిన స్వర్ణం....ఆట పట్ల మా వైఖరినే మార్చేసింది. ఇంతకుముందు కొన్ని పరిమితులు విధించుకొని ఉండేవాళ్లము. అయితే ఇప్పుడు ఏదైనా సాధించగలమన్న నమ్మకం వచ్చింది. మనం కష్టపడి పనిచేయాలి..ఇంతే చేయగలమన్న పరిమితులను బద్దలు కొట్టాలి .’అని అన్నాడు.
లాంగ్ జంప్లోనే రజతం సాధించిన అబ్దుల్లా అబూబకర్ మాట్లాడుతూ " నేను స్వర్ణం గెలవడానికి ప్రయత్నించాను..అయితే ఈ సారి అది కుదరలేదు. ఆసియా క్రీడలలో రాణిస్తాను."అని విశ్వాసం వ్యక్తం చేశాడు. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో రజతం గెలిచిన అవినాష్ సాబ్లే మల్టీ-స్పోర్ట్స్ ఈవెంట్లో తన ప్రదర్శన పట్ల మాట్లాడుతూ ‘ఈ ఈవెంట్లో భారత్ నాలుగో లేదా ఐదో స్థానం వరకూ రాగలదని అందరూ చెప్పేవారు. కానీ నేను పతకం గెలవడానికి చాలా కష్టపడ్డాను. పతకం సాధిస్తానని నమ్మాను. ఫైనల్గా దేశానికి పతకాన్ని తీసుకురావడంతో సంతోషంగా ఉంది.’అని సాబ్లే చెప్పాడు. మెన్స్ వాక్ రేసులో కాంస్య పతకం గెలిచిన సందీప్ కుమార్ వచ్చే ఆసియా క్రీడలు, ఒలింపిక్స్లో కచ్చితంగా రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలో ఎల్దోస్ పాల్ 17.03మీటర్లు దూకి పసిడి సాధించాడు. కామన్వెల్త్ క్రీడల్లో ఈ విభాగంలో భారత్కు ఇదే తొలి స్వర్ణం. మన దేశానికే చెందిన అబ్దుల్లా అబూబకర్ నరంగోలింటెవిడ్ 17.02 మీటర్లు దూకి రజతం సాధించాడు. భారత్కే చెందిన ప్రవీణ్ చిత్రవేల్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.10,000మీటర్ల పరుగు పందెంలో భారత అథ్లెట్ సందీప్ కుమార్ సత్తా చాటాడు. 38:49.21నిమిషాల్లో పరుగు పూర్తి చేసి రజతం దక్కించుకున్నాడు. సాబ్లే స్టీపుల్చేజ్లో 8 నిమిషాల 11.20 సెకన్ల టైమింగ్తో తన జాతీయ రికార్డు (8.12.48 )ను మెరుపుపర్చుకుని పతకం నెగ్గాడు. అయితే 0.05 సెకన్ల తేడాతో అతడు పసిడి కోల్పోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు