CWG 2022: కామన్వెల్త్‌ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌ జట్టు తొలి ఓటమి

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో మహిళల టీమ్‌ఇండియా ఓటమిపాలైంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా...

Published : 29 Jul 2022 18:39 IST

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో మహిళల జట్టు ఓటమిపాలైంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆ జట్టు టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్లు ఆష్లీ గార్డ్నర్‌ (52 నాటౌట్‌; 35 బంతుల్లో 9x4), గ్రేస్‌ హారిస్‌ (37; 20 బంతుల్లో 5x4, 2x6) భారత బౌలర్లపై ఎదురుదాడి చేయడంతో 19 ఓవర్లలోనే విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 154/8 స్కోర్‌ సాధించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (52; 34 బంతుల్లో 8x4, 1x6), షెఫాలీ వర్మ (48; 33 బంతుల్లో 9x4) రాణించినా ఫలితం లేకుండా పోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని