Pro Kabaddi - 2022: ప్రొ కబడ్డీ లీగ్ విజేత దబంగ్ దిల్లీ

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో భాగంగా పట్నా పైరేట్స్‌, దబంగ్‌ దిల్లీ జట్ల మధ్య జరిగిన తుది పోరులో దిల్లీ తొలిసారి ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. హోరాహోరీగా సాగిన తుదిపోరులో 37-36 తేడాతో..

Published : 25 Feb 2022 21:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో భాగంగా పట్నా పైరేట్స్‌, దబంగ్‌ దిల్లీ జట్ల మధ్య జరిగిన తుది పోరులో దిల్లీ తొలిసారి ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. హోరాహోరీగా సాగిన తుదిపోరులో 37-36 తేడాతో దిల్లీ జట్టు గెలుపొందింది. దీంతో మూడు సార్లు టైటిల్‌ విజేత పట్నా పైరేట్స్ ఒక పాయింట్ తేడాతో ఓటమి పాలైంది. 

దిల్లీ జట్టులో విజయ్‌ 14, నవీన్‌ కుమార్‌ 13 పాయింట్లు సాధించగా.. సందీప్‌ నర్వాల్‌, మంజీత్ చిల్లర్ చెరో రెండు పాయింట్లు రాబట్టారు. పట్నా జట్టులో సచిన్‌ 10, గుమన్‌ సింగ్‌ 9, మహమ్మద్‌ రెజా 5, ప్రశాంత్‌ కుమార్‌ రెండు, నీరజ్ కుమార్‌, సజిన్ తలో ఒక పాయింట్ సాధించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని