Danish kaneria: భారత టీ20 లీగ్ గురించి ఆలోచించడం మానేయండి: డానిష్ కనేరియా
భారత ఆటగాళ్లు టీ20 లీగ్పై ఉన్న ఆసక్తిని అంతర్జాతీయ క్రికెట్పై కూడా చూపాలంటూ పాక్ మాజీ ఆటగాడు విమర్శించాడు.
దిల్లీ: బంగ్లాదేశ్(Bangladesh)తో సిరీస్ నేపథ్యంలో భారత ఆటగాళ్లపై పాకిస్థాన్(Pakistan) మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా(Danish kaneria) విమర్శలు గుప్పించాడు. భారత టీ20 లీగ్(T20 league) గురించి ఆలోచించడం మాని అంతర్జాతీయ క్రికెట్పై వారు దృష్టి సారించాలని అన్నాడు. సిరీస్ ఫేవరేట్గా బరిలోకి దిగిన టీమ్ఇండియా బంగ్లా ఆటగాళ్ల ధాటికి రాణించలేకపోయిన విషయం తెలిసిందే. దీంతో టెస్టు సిరీస్లోనైనా విజయాన్ని కైవసం చేసుకోవాలనే టీమ్ఇండియా పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో కనేరియా మాట్లాడుతూ ఆటగాళ్ల తీరును తప్పుపట్టాడు.
‘‘భారత టీ20 లీగ్ గురించి ఆలోచించడం మానేయండి. దేశం కోసం ఆలోచించండి. ఫ్రాంఛైజీ క్రికెట్ కన్నా భారత క్రికెట్ ఎంతో ముఖ్యం. ఫ్రాంఛైజీ క్రికెట్లో డబ్బు ఉంది. కానీ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి కూడా మీరది సంపాదించుకోవచ్చు. మీరు దేశం కోసం ఆడే ఆట ప్రాధాన్యాన్ని గుర్తించలేకపోతే ఇటువంటి ఫలితాలనే చూడాల్సి ఉంటుంది’’ అంటూ ఈ మాజీ ఆటగాడు వ్యాఖ్యలు చేశాడు.
భారత జట్టుకు ఆటగాళ్ల మార్పుల విషయంలో నిర్దిష్టమైన ప్రణాళిక లేదన్నాడు. ఈ టెస్టు సిరీస్లో సైతం బంగ్లాదేనని పేర్కొన్నాడు. ‘‘ఏ స్థానంలో బ్యాటింగ్కు దిగాలో బ్యాటర్లకే అవగాహన లేదు. ఎందుకంటే, వారితో ఒక్కోసారి ఒక్కో స్థానంలో ఆడిస్తుంటారు. బౌలింగ్ అటాక్లోనూ మార్పులు చేస్తుంటారు. ఈ విషయంలో సరైన ప్రణాళిక అమలు చేయడంలేదు. భారత క్రికెట్ పడిపోతోంది. బంగ్లాదేశ్ ఈ టెస్టు సిరీస్ను సైతం గెలిచే అవకాశం ఉంది’’ అంటూ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు