DC vs PBKS: మేం గెలవటానికి ఆడినట్లు లేదు: డేవిడ్ వార్నర్
ప్లేఆఫ్స్ అవకాశాలను పూర్తిగా కోల్పోయిన జట్లలో దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ముందుంది. పంజాబ్ చేతిలోనూ ఓటమి చవిచూసిన దిల్లీ.. తన ఆఖరి మ్యాచుల్లో గెలిస్తే పాయింట్ల పట్టికలో కాస్త ముందుకొచ్చే అవకాశం మాత్రమే ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ సీజన్లో (IPL 2023) దిల్లీ క్యాపిటల్స్ తీరు మారలేదు. హార్డ్ హిట్టర్లు ఉన్నప్పటికీ.. జట్టు మాత్రం పాయింట్ల పట్టికలో పైకిమాత్రం ఎగబాకలేకపోతోంది. తాజాగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లోనూ 168 పరుగుల టార్గెట్ను ఛేదించడంలో తడబాటుకు గురైంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (54*), ఫిలిప్ సాల్ట్ (21) మంచి ఆరంభం ఇచ్చినా సద్వినియోగం చేసుకోకుండా ఓటమిపాలైంది. దీంతో చివరికి 136/8 స్కోరుకే పరిమితమైంది. ఈ క్రమంలో తమ జట్టు ప్రదర్శనపై కెప్టెన్ డేవిడ్ వార్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లను కోల్పోవడం వల్ల పుంజుకోలేకపోతున్నామని పేర్కొన్నాడు.
‘‘అద్భుత ఆరంభం దక్కినా.. సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఇలాంటి ఫలితం తీవ్రంగా నిరాశపరిచింది. మంచి కాంబినేషన్తోనే బరిలోకి దిగాం. కానీ, మధ్య ఓవర్లలో నాలుగైదు వికెట్లను కోల్పోవడం వల్ల ముందుకు వెళ్లలేకపోయాం. మా ఫీల్డింగ్ సమయంలోనూ కీలక క్యాచ్లను విడిచి పెట్టడం కూడా నష్టం చేసింది. ఇక ఆఖరి రెండు మ్యాచుల్లో స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నిస్తాం’’ అని వార్నర్ తెలిపాడు.
ఒకే ఒక్కడు.. ప్రభ్ సిమ్రన్
ఓ వైపు వికెట్లు పడుతున్నా.. పంజాబ్ ఓపెనర్గా వచ్చిన ప్రభ్ సిమ్రన్ సింగ్ (103) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 19వ ఓవర్ వరకు ఉన్న సిమ్రన్ 61 బంతుల్లో సెంచరీ మార్క్ను తాకాడు. అయితే 68 పరుగుల వద్ద ప్రభ్ ఇచ్చిన క్యాచ్ను దిల్లీ ఫీల్డర్ రిలీ రొసోవ్ చేజార్చాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రభ్ సెంచరీ బాదేశాడు. తక్కువ వయసులో ఐపీఎల్ శతకం చేసిన ఐదో బ్యాటర్గా మారాడు. ప్రభ్ 22 ఏళ్ల 276 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. ఈ జాబితాలో మనీశ్ పాండే (19 సంవత్సరాల 253 రోజులు) తొలి ఆటగాడు కావడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం