David Warner: దిల్లీతో కొనసాగడం సంతోషంగా ఉంది: డేవిడ్ వార్నర్
దిల్లీ జట్టులో తన ప్రయాణం బాగుందని, అక్కడ ఓపెనర్గా సమయాన్ని ఆస్వాదిస్తున్నానని ప్రముఖ విధ్వంసక బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ఈ సీజన్కు ముందు హైదరాబాద్ టీమ్ వదిలేయడంతో మెగా వేలంలో పాల్గొన్న...
ముంబయి: దిల్లీ జట్టులో తన ప్రయాణం బాగుందని, అక్కడ ఓపెనర్గా సమయాన్ని ఆస్వాదిస్తున్నానని ప్రముఖ విధ్వంసకర బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ఈ సీజన్కు ముందు హైదరాబాద్ టీమ్ వదిలేయడంతో మెగా వేలంలో పాల్గొన్న అతడు చివరికి దిల్లీ చెంతకు చేరాడు. ఈ క్రమంలోనే ఆ జట్టు తరఫున ఓపెనర్గా.. పృథ్వీ షాకు జోడీగా బరిలోకి దిగుతున్నాడు. ఇక ఆదివారం సాయంత్రం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో వార్నర్ (61; 45 బంతుల్లో 6x4, 2x6), షా (51; 29 బంతుల్లో 7x4, 2x6) రెచ్చిపోవడంతో దిల్లీ ఈ సీజన్లో అత్యధిక స్కోర్ 215 సాధించింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం మాట్లాడిన వార్నర్ ఇలా చెప్పుకొచ్చాడు.
‘ఈ మ్యాచ్లో రాణించడం సంతోషంగా ఉంది. బ్యాటింగ్ చేసేందుకు ఇది మంచి వికెట్. అయితే, మ్యాచ్ ముగింపు దశకు చేరుకునే సరికి పిచ్ నెమ్మదించింది. ఇక మా బ్యాటింగ్ విషయానికి వస్తే మేం అద్భుతంగా ఆడాం. ఒక ఎండ్లో పృథ్వీ అలా ధాటిగా ఆడుతుంటే మరో ఎండ్లో నా పని తేలికవుతుంది. ఈ టీ20 ఫార్మాట్లో ఓపెనర్లు ఇద్దరూ ఒకేసారి ఇలా ధాటిగా ఆడటం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ మ్యాచ్లో మేం ఆడిన తీరుకు చాలా సంతోషంగా ఉంది. దిల్లీ జట్టులో నా ప్రయాణం బాగుంది. ఓపెనర్గా ఇక్కడ ఆస్వాదిస్తున్నా’ అని వార్నర్ పేర్కొన్నాడు. కాగా, వార్నర్ గతేడాది వరకు హైదరాబాద్ టీమ్లో కొనసాగగా ఆ సీజన్లో ఒక్కసారే విఫలమైనా.. జట్టు యాజమాన్యం అర్ధాంతరంగా తొలుత కెప్టెన్సీ నుంచి.. ఆపై జట్టులో నుంచి తొలగించి ఘోరంగా అవమానించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ మ్యాచ్లో గెలుపొందిన అనంతరం మాట్లాడిన కెప్టెన్ రిషభ్ పంత్ తొలుత తాము ఫీల్డింగ్ చేయాల్సిందని చెప్పాడు. కానీ, తమ జట్టులో ఉన్న బ్యాటింగ్ బలంతో కోల్కతాపై ఒత్తిడి పెంచాలనుకున్నట్లు తెలిపాడు. చివర్లో శార్దూల్ ఠాకూర్ సైతం అద్భుతంగా బౌలింగ్ చేశాడన్నాడు. తేమ ప్రభావం లేని పిచ్పై 170-180 పరుగులు మంచి స్కోర్ అని, 200కిపైగా ఛేదించడం కష్టమని చెప్పాడు. మరోవైపు కుల్దీప్ యాదవ్ బౌలింగ్ కూడా బాగుందని పంత్ మెచ్చుకున్నాడు. తాము ఈ మ్యాచ్లో చాలా మెరుగైనట్లు వెల్లడించాడు. కాగా, ఈ మ్యాచ్లో దిల్లీ నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్కతా 171 పరుగులకు ఆలౌలైంది. ఓపెనర్లు పృథ్వీ, వార్నర్ బ్యాటింగ్లో రాణిస్తే.. కుల్దీప్ 4/35, ఖలీల్ అహ్మద్ 3/25, శార్దూల్ 2/30 బంతితో మెరిశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్