David Warner: డేవిడ్ వార్నర్.. ఇది కదా స్వీట్ రివెంజ్..!
ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం కొందరికే అలవాటు. అలా ఒదిగి ఉండటం కూడా అంత తేలికేం కాదు.’’ ఇప్పుడు ఈ సామెత దిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు...
హైదరాబాద్పై విధ్వంసం.. బ్యాట్తోనే సమాధానం..
‘‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం కొందరికే అలవాటు. అలా ఒదిగి ఉండటం కూడా అంత తేలికేం కాదు.’’ ఇప్పుడు ఈ సామెత దిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు సరిగ్గా సరిపోతుంది. కేవలం ఒక్క సీజన్లో విఫలమైనంత మాత్రాన ఘోర అవమానంతో బయటకు గెంటేసిన హైదరాబాద్ జట్టుకు ఇప్పుడు తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. కనీసం కారణం కూడా చెప్పకుండా వదిలేసిన జట్టుపై.. వీసమెత్తు మాట తూలకుండా తానేంటో, తన విలువేంటో ఆటతోనే తేల్చి చెప్పాడు. దీంతో ఈ దిల్లీ ఓపెనర్ హైదరబాద్ జట్టుపై స్వీట్ రివెంజ్ తీసుకున్నాడు.
దిల్లీతో మొదలెట్టి.. హైదరాబాద్తో పేరు సంపాదించి..
డేవిడ్ వార్నర్ భారత టీ20 లీగ్లో చెరగని ముద్రవేశాడు. 2009లో దిల్లీ జట్టుతోనే ఈ టోర్నీలో ప్రయాణం మొదలెట్టాడు. 2013 వరకూ ఐదేళ్లు ఇక్కడే ఆడినా అప్పుడప్పుడు మెరుపులు మెరిపించించడమే తప్ప పెద్దగా పేరు సంపాదించలేదు. కానీ, 2014లో హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించడం మొదలుపెట్టాక అతడి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఒకవైపు సారథిగా జట్టును ముందుండి నడిపిస్తూనే మరోవైపు బ్యాట్స్మన్గా పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలోనే 2016లో అప్పటి బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ (973)తో పోటీపడి మరీ పరుగులు సాధించాడు. ఆ సీజన్లో వార్నర్ తొమ్మిది అర్ధశతకాలతో మొత్తం (848) పరుగులు దంచికొట్టాడు. మరోవైపు బెంగళూరుతోనే తలపడిన ఫైనల్లోనూ ధనాధన్ బ్యాటింగ్తో హైదరాబాద్కు కప్పు అందించాడు. దీంతో ఆ జట్టును వరుసగా ఐదేళ్లు ప్లేఆఫ్స్ వరకూ తీసుకెళ్లి ఘన చరిత్ర సృష్టించాడు.
కోహ్లీ, రోహిత్ కన్నా మేటి..
ఇక ఈ టీ20 టోర్నీలో బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ (6,499), పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్ (6,153), ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ (5,766) అత్యధిక పరుగుల వీరులుగా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వారి తర్వాత వార్నర్ (5,762) పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు. అయినా, సగటు, స్ట్రైక్రేట్, అర్ధశతకాల సంఖ్యల పరంగా చూస్తే వార్నరే మేటిగా ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ (36.51), ధావన్ (35.36), రోహిత్ (30.51) సగటుతో కొనసాగుతుండగా.. వార్నర్ (42.06) ముగ్గురికన్నా గొప్పగా రాణిస్తున్నాడు. అలాగే స్రైక్రేట్లోనూ వార్నర్ (140.71).. కోహ్లీ (129.26), ధావన్ (126.53), రోహిత్ (130.19)ల కన్నా అద్భుతంగా దూసుకుపోతున్నాడు. ఇక శతకాలు, అర్ధ శతకాలతో పోల్చి చూసినా వార్నర్ 4 శతకాలు, 53 అర్ధశతకాలతో ముందున్నాడు. విరాట్ 5 శతకాలు, 43 అర్ధశతకాలతో ఉండగా, ధావన్ 2 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు, రోహిత్ 1 శతకం, 40 అర్ధశతకాలతో ఉన్నారు. ఇలా ఏ విధంగా చూసినా వార్నర్ అద్భుతంగా రాణిస్తున్నాడు.
ఈ సీజన్లో ఎలా ఆడుతున్నాడంటే..
వార్నర్ ఎప్పటిలాగే ఈ సీజన్లోనూ అదరగొడుతున్నాడు. గతేడాది హైదరాబాద్ తరఫున ఆడిన 8 మ్యాచ్ల్లో రెండు అర్ధశతకాలతో 195 పరుగులే చేసిన అతడు ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో నాలుగు అర్ధశతకాలతో 356 పరుగులు చేశాడు. దీంతో ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో దూసుకుపోతున్నాడు. అయితే, ఇక్కడ టాప్-10 బ్యాట్స్మెన్ అందరూ 9, 10 మ్యాచ్లు ఆడగా.. వార్నర్ 8 మ్యాచ్ల్లోనే టాప్లో ఒకడిగా నిలిచాడు. దీన్నిబట్టి అతడెలా రాణిస్తున్నాడో, అతడిని వదిలేసుకొని హైదరాబాద్ ఎంత పెద్ద తప్పు చేసిందో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా గతరాత్రి ఆ జట్టుపైనే చెలరేగడం విశేషం. ఓపెనర్గా వచ్చిన వార్నర్ (92 నాటౌట్; 58 బంతుల్లో 13x4, 3x6) విధ్వంసం సృష్టించి ఈ సీజన్లో తన అత్యధిక స్కోర్ నమోదు చేయడమే కాకుండా హైదరాబాద్కు మ్యాచ్ దూరం చేయడంలోనూ అతడిదే కీలక పాత్ర. దీంతో దిల్లీ ఈ సీజన్లో ఐదో విజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. వార్నర్ మున్ముందు ఇలాగే ఆడితే ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసులోనూ దూసుకుపోయే అవకాశం ఉంది.
ఇందుకే వార్నర్ గ్రేట్ అనేది..
ఇక గతరాత్రి మ్యాచ్ గెలిచి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాక వార్నర్ మాట్లాడాడు. హైదరాబాద్పై ఇలా చెలరేగడానికి తనకేం అదనపు స్ఫూర్తి అవసరం లేదన్నాడు. దీన్నిబట్టి వార్నర్ ఎంత సహృదయుడో అర్థం చేసుకోవచ్చు. గతేడాది సీజన్ మధ్యలో హైదరాబాద్ తుది జట్టులో నుంచి తొలగించినా, తర్వాత కెప్టెన్సీ నుంచి పక్కనపెట్టినా.. వార్నర్ చాలా హూందాగా ప్రవర్తించాడు. సామాజిక మాధ్యమాల్లో ఆ జట్టుపై ఎన్ని విమర్శలొచ్చినా వార్నర్ ఒక్క మాట కూడా తూలలేదు. మనసులో ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుతూనే కనిపించాడు. ముఖ్యంగా కొన్ని మ్యాచ్లకు గ్యాలరీలో నిల్చొని మరీ జట్టును ఉత్సాహపర్చాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే ఇదేనేమో! అందుకే ఈ మ్యాచ్లో హైదరాబాద్పై అత్యధిక స్కోర్ సాధించినా చాలా నిష్కల్మషంగా కనిపించాడు. తన ఆటకు కట్టుబడి ఉంటే పరుగులు వాటంతట అవే వస్తాయనే ప్రాథమిక సూత్రాన్నే నమ్ముకొన్నాడు. ఎంతైనా తనని దూరం చేసుకున్న జట్టుపై ఈ బ్యాటింగ్ దిగ్గజం స్వీట్ రివెంజ్ తీర్చుకొన్నాడు.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. -
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
ఐపీఎల్లో అనుసరిస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు అంతగా నచ్చలేదని ముంబయి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. -
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
ఐపీఎల్ ముగిసిన వారం తర్వాత టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మాత్రం ఆడే అవకాశాలు తక్కువే. -
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
ముల్లాన్పుర్ వేదికగా పంజాబ్తో తలపడేందుకు ముంబయి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు విజయం సాధించాలంటే కెప్టెన్ రాణించాలని మాజీ క్రికెటర్ ఫించ్ వ్యాఖ్యానించాడు. -
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది. -
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM