Team India: రెండు టెస్టుల కోసం అవసరమా?
భారత్, శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల క్రికెట్ ఐదు రోజులు వాయిదా పడటంతో పృథ్వీషా, దేవ్దత్ పడిక్కల్ను ఇంగ్లాండ్కు పంపించడంలో మరింత జాప్యం జరుగుతుందని మాజీ క్రికెటర్ దీప్దాస్ గుప్తా పేర్కొన్నారు...
దేవ్దత్, పృథ్వీని ఇంగ్లాండ్కు పంపడంపై దీప్దాస్ గుప్తా
ఇంటర్నెట్డెస్క్: భారత్, శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల క్రికెట్ ఐదు రోజులు వాయిదా పడటంతో పృథ్వీషా, దేవ్దత్ పడిక్కల్ను ఇంగ్లాండ్కు పంపించడంలో మరింత జాప్యం జరుగుతుందని మాజీ క్రికెటర్ దీప్దాస్ గుప్తా పేర్కొన్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన ఆయన టీమ్ఇండియా.. లంక, ఇంగ్లాండ్ పర్యటనలపై స్పందించారు.
‘ఇంగ్లాండ్లో టెస్టు సిరీస్ కోసం ఇద్దరు యువ ఓపెనర్లు దేవ్దత్, పృథ్వీషా వెళ్తారనే చర్చ వారం, పదిరోజులుగా సాగుతోంది. లంక పర్యటనలో మ్యాచ్లు ఆలస్యమవడంతో వాళ్లిద్దరూ ఈనెల 29 వరకు అక్కడే ఉంటారు. ఒకవేళ 30న ఇంగ్లాండ్కు బయలుదేరినా అక్కడ మరో పదిరోజులు హోటల్ క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి. అది పూర్తయిన వెంటనే నేరుగా టెస్టు మ్యాచ్లు ఆడే అవకాశం లేదు. ఎందుకంటే వారు సన్నద్ధమవ్వడానికి ఇంకో వారం రోజులు పడుతుంది. పడిక్కల్, షా టెస్టు క్రికెట్ ఆడి చాలా రోజులైంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు వెళ్లినా నాలుగో టెస్టు వరకు అందుబాటులో ఉండరు. అలాంటప్పుడు కోహ్లీసేనకు కొత్త ప్రశ్న ఎదురవుతుంది. కేవలం రెండు టెస్టుల కోసం వారిని అక్కడికి తీసుకెళ్లడం అవసరమా? అనే సందేహం తలెత్తుతుంది. ఇప్పటికే ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు సరిపడా ఓపెనర్లు ఉన్నారు’ అని దీప్దాస్ తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM