Deepak Chahar: దీపక్ కంటతడి.. కాబోయే భార్య స్పందన ఇదీ..!
దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన చివరి వన్డే మ్యాచ్లో దీపక్ చాహర్ (54: 34 బంతుల్లో 5×4, 2×6) ఆఖరి వరకు పోరాడినా.. భారత్ని ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఆ బాధను నియంత్రించుకోలేక కన్నీళ్లు కార్చాడు...
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన చివరి వన్డే మ్యాచ్లో దీపక్ చాహర్ (54: 34 బంతుల్లో 5×4, 2×6) ఆఖరి వరకు పోరాడినా.. భారత్ను ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఆ బాధను నియంత్రించుకోలేక కంటతడి పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయంపై స్పందించిన దీపక్ చాహర్ కాబోయే భార్య జయ భరద్వాజ్.. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకుంది.
‘క్రికెట్లో కొన్నిసార్లు ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. జట్టులో చోటు దక్కనప్పుడు ఇంత కంటే బాధగా ఉంటుంది. కానీ, ఆట పట్ల మీరు చూపే అంకితభావం, అభిరుచి, జట్టు విజయం కోసం ఆఖరి వరకు పోరాడే గుణం.. మిమ్మల్ని మైదానంలో ఛాంపియన్గా నిలుపుతాయి. క్రికెట్లో గెలుపోటములు సహజమే. కొన్ని సార్లు ఓడిపోతుంటాం. కొన్నిసార్లు గెలుస్తుంటాం. అయితే, భారత జట్టు విజయం కోసం ఆఖరి వరకు మీరు పోరాడిన తీరు పట్ల దేశం మొత్తం గర్విస్తోంది. అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా దేశాన్ని గెలిపించేందుకు నేనున్నానని నిరూపించారు. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది. జై హింద్’ అని జయ భరద్వాజ్ పోస్ట్ చేశారు.
కేప్టౌన్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో భారత్ నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 287 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 288 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన టీమ్ఇండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (9) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (65), శిఖర్ ధావన్ (61) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ని నిలబెట్టారు. స్వల్ప వ్యవధిలో వీళ్లిద్దరూ పెవిలియన్ చేరడంతో భారత్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ రాణించలేకపోయారు. ఆఖర్లో బ్యాటింగ్ వచ్చిన దీపక్ చాహర్ భారత్ విజయంపై ఆశలు రేకెత్తించాడు. బౌండరీలతో స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. అయితే, లుంగి ఎంగిడి వేసిన 48వ ఓవర్లో షాట్కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ పరాజయం ఖరారైపోయింది. ఆ తర్వాత వరుస ఓవర్లలో బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ ఔటయ్యారు. స్పూర్తిదాయక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న దీపక్ చాహర్కు భవిష్యత్లో మరిన్ని అవకాశాలిస్తామని కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
కెప్టెన్సీలో రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య ఉన్న పోలికలను భారత యువ కీపర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) వివరించాడు. -
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
Mumbai Indians Captiancy: ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్య... ఈ మార్పు అభిమానులకు సమ్మతమేనా? -
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్స్టిట్యూట్గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్కీపర్ ధ్రువ్ జురెల్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.
తాజా వార్తలు (Latest News)
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...