Hooda : పఠాన్ బ్రదర్స్ నుంచి చాలా నేర్చుకున్నా.. కుంబ్లే భాయ్కు థ్యాంక్స్: దీపక్ హుడా
వెస్టిండీస్తో వన్డే సిరీస్కు ఎంపికైన టీమ్ఇండియా ఆటగాడు దీపక్ హుడా.. కష్ట సమయంలో..
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్తో వన్డే సిరీస్కు ఎంపికైన టీమ్ఇండియా ఆటగాడు దీపక్ హుడా.. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన పఠాన్ సోదరులకు కృతజ్ఞతలు తెలిపాడు. విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలలో అద్భుత ప్రదర్శన చేయడంతో మళ్లీ వన్డే జట్టులోకి వచ్చే అవకాశం దీపక్కి కలిగింది. గతంలో శ్రీలంకతో నిదహాస్ ట్రోఫీ జట్టులోనూ సభ్యుడైనప్పటికీ ఒక్క మ్యాచ్లోనూ ఆడలేకపోయాడు. ‘‘నేను టీమ్ఇండియాకు ఎంపిక కావడంపై చాలా మందికి అనేక అనుమానాలు ఉన్నాయి. తుది జట్టులో ఆడతానో లేదో కూడా తెలియదు. అయితే ఇర్ఫాన్ ఒకటే మాట చెప్పాడు. వేచి చూస్తూ ఉండు సమయం అదే వస్తుంది. నేను ఇర్ఫాన్, యూసఫ్ నుంచి చాలా విషయాలను తెలుసుకున్నా. ప్రశాంతంగా ఉండాలని వారిద్దరి దగ్గర నుంచి నేర్చుకున్నా. అయితే యువకుడిగా అలా ఉండటం కష్టమైంది. ప్రశాంతంగా ఉండలేకపోవడం కూడానూ నా ఆటకు ఆటంకం కలిగించింది. అందుకే దానికోసం చాలా కష్టపడ్డా’’ అని దీపక్ హుడా వివరించాడు.
ఆటగాడిగా సన్నద్ధత కావడానికి ఇర్ఫాన పఠాన్ తనకు ఎంతో సహకరించాడని దీపక్ తెలిపాడు. నిజాయితీని ప్రదర్శించడంలో సహాయపడిందని పేర్కొన్నాడు. ‘‘నేను తప్పకుండా ఇర్ఫాన్ భాయ్ను గుర్తుకు తెచ్చుకోవాలి. సన్నద్దత ఎంత ముఖ్యమో చాలా చక్కగా చెప్పాడు. వేరేవారి నుంచి ఏమీ ఆశించకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. అది జిమ్ అయినా.. సాధన సెషన్స్లోనైనా సరే కష్టపడి పని చేయడమే నేర్చుకున్నా. దానికి తగ్గ ఫలితం ఇప్పుడొచ్చింది’’ అని దీపక్ హుడా ఆనందం వ్యక్తం చేశాడు. బరోడాకు ఆడుతున్నప్పుడు ఎత్తుపల్లాలను అనుభవించానని, అలానే వేరే రాష్ట్రానికి (రాజస్థాన్) మారినప్పుడు కూడా వారిద్దరూ ఎంతో సపోర్ట్గా నిలిచారన్నాడు. అలానే పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేకీ ధన్యవాదాలు తెలిపాడు. తన మీద నమ్మకంతో రెండు సీజన్లలో అవకాశం కల్పించడంలో కుంబ్లే కీలక పాత్ర పోషించాడని వెల్లడించాడు. దీపక్ హుడా గతంలో సన్రైజర్స్ హైదరాబాద్కూ ఆడాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM