Delhi : ఈ సీజన్లోనైనా దిల్లీ ‘పంతం’ నెగ్గుతుందా?
తెలుగు పారిశ్రామిక వేత్తకు చెందిన జీఎంఆర్ గ్రూప్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ సొంతమైన...
వార్నర్, శార్దూల్ కోసం భారీ మొత్తం వెచ్చించిన దిల్లీ
ఒకే ఒక్కసారి దేశవాళీ లీగ్ ఫైనల్కు చేరిన మూడు జట్లలో దిల్లీ కూడా ఉంది. అదీ మెగా టోర్నీ ప్రారంభమైన దాదాపు పుష్కరం తర్వాత కావడం విశేషం. గతేడాది యువ కెప్టెన్ రిషభ్ పంత్ నేతృత్వంలోని ప్లేఆఫ్స్ వరకు వెళ్లినా ఫైనల్కు చేరుకోలేకపోయింది. ఈసారి మెగా వేలంలో కీలక ఆటగాళ్లను దక్కించుకుని మరీ బరిలోకి దిగబోతోంది. మరి దిల్లీ కీలకం ఎవరు? ఓపెనింగ్, మిడిలార్డర్.. బౌలింగ్ దళం ఎలా ఉండనుంది? తదితర అంశాల్ని పరిశీలిస్తే..
తెలుగు పారిశ్రామికవేత్తకు చెందిన జీఎంఆర్ గ్రూప్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ సొంతమైన దిల్లీకి యువ క్రికెటర్ రిషభ్ పంత్ నాయకుడు. ఈ సారి మెగా వేలంలో నాణ్యమైన ఆటగాళ్ల కోసం చాలా తెలివిగా ఖర్చు పెట్టింది. టీమ్ఇండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు భారీ మొత్తం వెచ్చించింది. గత రెండు సీజన్లు తప్పించి అంతకుముందు వరకు హైదరాబాద్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్, సారథిగా ఫ్రాంచైజీకి టైటిల్ను అందించిన డేవిడ్ వార్నర్ (రూ.6.50 కోట్లు)ను ఈసారి దిల్లీ మంచి ధరకు సొంతం చేసుకొంది. అండర్ -19 ప్రపంచకప్ టైటిల్ను అందించిన యువ భారత్ సారథి యాష్ ధుల్తో సహా స్పిన్నర్ విక్కీ ఓత్స్వాల్ను దిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసుకుంది.
బ్యాటింగ్లో వీరే కీలకం..
బ్యాటింగ్పరంగా దిల్లీకి పెద్దగా ఇబ్బందులేమీ లేవు. అయితే విదేశీ ఆటగాళ్ల మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. రిషభ్ పంత్, పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్, రోవ్మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, కేఎస్ భరత్ కీలక ప్లేయర్లు. గత సీజన్ వరకు పృథ్వీషాకు తోడుగా శిఖర్ ధావన్ ఓపెనింగ్కు దిగేవాడు. ఈసారి ప్రమాదకర బ్యాటర్ డేవిడ్ వార్నర్ వచ్చేస్తాడు. వీరిద్దరూ కాసేపు నిలబడితే చాలు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. ఆ తర్వాత రోవ్మన్ పావెల్ వచ్చే అవకాశం ఉంది. రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, అశ్విన్ హెబ్బర్/కేఎస్ భరత్/సీఫెర్ట్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ వరుసగా బ్యాటింగ్ చేయగలరు.
బౌలింగ్ దాడి సూపర్బ్..
దిల్లీ బౌలింగ్ దళం మాత్రం అద్భుతం. అంతర్జాతీయంగా పేసర్లు, స్పిన్నర్లతో ఎటాకింగ్గా ఉంది. ఆన్రిచ్ నార్జ్, లుంగి ఎంగిడి, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజర్ రెహ్మాన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మిచెల్ మార్ష్, కమ్లేష్ నాగర్కోటి వంటి బౌలర్లు ఉండటం దిల్లీకి సానుకూలాంశం. తుది జట్టులో మాత్రం తప్పనిసరిగా నార్జ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, శార్దూల్, ముస్తాఫిజర్/మిచెల్ మార్ష్ ఉండే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్ పరంగా రిజర్వ్ బెంచ్ కూడా పటిష్టంగా ఉంది.
టాప్ ఆల్రౌండర్లు దిల్లీ సొంతం
పొట్టి ఫార్మాట్లో కీలకమైన ఆల్రౌండర్లు దిల్లీ జట్టులోనూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఆల్రౌండర్గా ఎదుగుతున్న అక్షర్ పటేల్ను దిల్లీ రిటెయిన్ చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే, భారీ మొత్తం (రూ.10.75 కోట్లు) వెచ్చించి మరీ కొనుగోలు చేసిన శార్దూల్ ఠాకూర్, మిచెల్ మార్ష్ (రూ. 6.50 కోట్లు)తో పాటు రోవ్మన్ పావెల్ (రూ. 2.80 కోట్లు) ఇటు బౌలింగ్తోపాటు బ్యాటింగ్ చేయగల సమర్థులు. మిడిలార్డర్తోపాటు లోయర్ ఆర్డర్లోనూ పరుగులు సాధించగలరు. ఈ క్రమంలో రికీ పాంటింగ్ కోచింగ్.. రిషభ్ పంత్ నాయకత్వంలో ఈసారైనా కప్ నెగ్గాలని దిల్లీ యాజమాన్యం సహా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
దిల్లీ జట్టు ఇదే:
రిషబ్ పంత్ (కెప్టెన్), అశ్విన్ హెబ్బర్, డేవిడ్ వార్నర్, మన్దీప్ సింగ్, పృథ్వీ షా, రోవ్మన్ పావెల్, కేఎస్ భరత్, టిమ్ సీఫెర్ట్, అక్షర్ పటేల్, కమ్లేష్ నాగర్కోటి, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబె, రిపల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, విక్కీ ఓత్స్వాల్, యాష్ ధుల్, ఆన్రిచ్ నార్జ్, చేతన్ సకారియా, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, ముస్తాఫిజర్ రహ్మాన్, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు