Delhi : ఈ సీజన్లోనైనా దిల్లీ ‘పంతం’ నెగ్గుతుందా?
తెలుగు పారిశ్రామిక వేత్తకు చెందిన జీఎంఆర్ గ్రూప్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ సొంతమైన...
వార్నర్, శార్దూల్ కోసం భారీ మొత్తం వెచ్చించిన దిల్లీ
ఒకే ఒక్కసారి దేశవాళీ లీగ్ ఫైనల్కు చేరిన మూడు జట్లలో దిల్లీ కూడా ఉంది. అదీ మెగా టోర్నీ ప్రారంభమైన దాదాపు పుష్కరం తర్వాత కావడం విశేషం. గతేడాది యువ కెప్టెన్ రిషభ్ పంత్ నేతృత్వంలోని ప్లేఆఫ్స్ వరకు వెళ్లినా ఫైనల్కు చేరుకోలేకపోయింది. ఈసారి మెగా వేలంలో కీలక ఆటగాళ్లను దక్కించుకుని మరీ బరిలోకి దిగబోతోంది. మరి దిల్లీ కీలకం ఎవరు? ఓపెనింగ్, మిడిలార్డర్.. బౌలింగ్ దళం ఎలా ఉండనుంది? తదితర అంశాల్ని పరిశీలిస్తే..
తెలుగు పారిశ్రామికవేత్తకు చెందిన జీఎంఆర్ గ్రూప్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ సొంతమైన దిల్లీకి యువ క్రికెటర్ రిషభ్ పంత్ నాయకుడు. ఈ సారి మెగా వేలంలో నాణ్యమైన ఆటగాళ్ల కోసం చాలా తెలివిగా ఖర్చు పెట్టింది. టీమ్ఇండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు భారీ మొత్తం వెచ్చించింది. గత రెండు సీజన్లు తప్పించి అంతకుముందు వరకు హైదరాబాద్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్, సారథిగా ఫ్రాంచైజీకి టైటిల్ను అందించిన డేవిడ్ వార్నర్ (రూ.6.50 కోట్లు)ను ఈసారి దిల్లీ మంచి ధరకు సొంతం చేసుకొంది. అండర్ -19 ప్రపంచకప్ టైటిల్ను అందించిన యువ భారత్ సారథి యాష్ ధుల్తో సహా స్పిన్నర్ విక్కీ ఓత్స్వాల్ను దిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసుకుంది.
బ్యాటింగ్లో వీరే కీలకం..
బ్యాటింగ్పరంగా దిల్లీకి పెద్దగా ఇబ్బందులేమీ లేవు. అయితే విదేశీ ఆటగాళ్ల మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. రిషభ్ పంత్, పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్, రోవ్మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, కేఎస్ భరత్ కీలక ప్లేయర్లు. గత సీజన్ వరకు పృథ్వీషాకు తోడుగా శిఖర్ ధావన్ ఓపెనింగ్కు దిగేవాడు. ఈసారి ప్రమాదకర బ్యాటర్ డేవిడ్ వార్నర్ వచ్చేస్తాడు. వీరిద్దరూ కాసేపు నిలబడితే చాలు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. ఆ తర్వాత రోవ్మన్ పావెల్ వచ్చే అవకాశం ఉంది. రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, అశ్విన్ హెబ్బర్/కేఎస్ భరత్/సీఫెర్ట్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ వరుసగా బ్యాటింగ్ చేయగలరు.
బౌలింగ్ దాడి సూపర్బ్..
దిల్లీ బౌలింగ్ దళం మాత్రం అద్భుతం. అంతర్జాతీయంగా పేసర్లు, స్పిన్నర్లతో ఎటాకింగ్గా ఉంది. ఆన్రిచ్ నార్జ్, లుంగి ఎంగిడి, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజర్ రెహ్మాన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మిచెల్ మార్ష్, కమ్లేష్ నాగర్కోటి వంటి బౌలర్లు ఉండటం దిల్లీకి సానుకూలాంశం. తుది జట్టులో మాత్రం తప్పనిసరిగా నార్జ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, శార్దూల్, ముస్తాఫిజర్/మిచెల్ మార్ష్ ఉండే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్ పరంగా రిజర్వ్ బెంచ్ కూడా పటిష్టంగా ఉంది.
టాప్ ఆల్రౌండర్లు దిల్లీ సొంతం
పొట్టి ఫార్మాట్లో కీలకమైన ఆల్రౌండర్లు దిల్లీ జట్టులోనూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఆల్రౌండర్గా ఎదుగుతున్న అక్షర్ పటేల్ను దిల్లీ రిటెయిన్ చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే, భారీ మొత్తం (రూ.10.75 కోట్లు) వెచ్చించి మరీ కొనుగోలు చేసిన శార్దూల్ ఠాకూర్, మిచెల్ మార్ష్ (రూ. 6.50 కోట్లు)తో పాటు రోవ్మన్ పావెల్ (రూ. 2.80 కోట్లు) ఇటు బౌలింగ్తోపాటు బ్యాటింగ్ చేయగల సమర్థులు. మిడిలార్డర్తోపాటు లోయర్ ఆర్డర్లోనూ పరుగులు సాధించగలరు. ఈ క్రమంలో రికీ పాంటింగ్ కోచింగ్.. రిషభ్ పంత్ నాయకత్వంలో ఈసారైనా కప్ నెగ్గాలని దిల్లీ యాజమాన్యం సహా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
దిల్లీ జట్టు ఇదే:
రిషబ్ పంత్ (కెప్టెన్), అశ్విన్ హెబ్బర్, డేవిడ్ వార్నర్, మన్దీప్ సింగ్, పృథ్వీ షా, రోవ్మన్ పావెల్, కేఎస్ భరత్, టిమ్ సీఫెర్ట్, అక్షర్ పటేల్, కమ్లేష్ నాగర్కోటి, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబె, రిపల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, విక్కీ ఓత్స్వాల్, యాష్ ధుల్, ఆన్రిచ్ నార్జ్, చేతన్ సకారియా, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, ముస్తాఫిజర్ రహ్మాన్, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?