IPL 2021: దిల్లీ క్యాపిటల్స్‌ లక్ష్యం 130 పరుగులు

టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్‌ (33) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ముంబయి జట్టుకి ఆరంభంలోనే షాక్‌ తగిలింది.

Published : 02 Oct 2021 17:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్‌ (33) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ముంబయి జట్టుకి ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్ రోహిత్‌ శర్మ(7) అవేశ్‌ ఖాన్‌ వేసిన రెండో ఓవర్లో బౌల్డయ్యాడు. మరో ఓపెనర్ క్వింటన్ డి కాక్‌ (19) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. అక్షర్‌ పటేల్‌ వేసిన ఏడో ఓవర్లో నోర్జేకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. సౌరభ్‌ తివారి (15), కీరన్‌ పొలార్డ్‌(6) ఆకట్టుకోలేకపోయారు. ఆఖర్లో వచ్చిన హార్దిక్‌ పాండ్య (17), జయంత్‌ యాదవ్‌ (11) నిరాశ పరిచాడు. నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ (0) డకౌటయ్యాడు. కృనాల్‌ పాండ్య (13), జస్ప్రీత్ బుమ్రా (1) నాటౌట్‌గా నిలిచారు. దిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ మూడు, అవేశ్‌ ఖాన్‌ మూడు, అన్రిచ్‌ నోర్జే, రవిచంద్రన్‌ అశ్విన్‌ తలో వికెట్‌ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని