Delhi Capitals : ఐపీఎల్‌ 15వ సీజన్‌.. సరికొత్త జెర్సీతో దిల్లీ క్యాపిటల్స్

ఇంకో రెండు వారాల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 15వ సీజన్‌ పోటీల్లో...

Updated : 14 Mar 2022 20:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంకో రెండు వారాల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 15వ సీజన్‌ పోటీల్లో రిషభ్ పంత్‌ నాయకత్వంలోని దిల్లీ క్యాపిటల్స్ కొత్త లుక్‌తో కనిపించనుంది. ఈ మేరకు తమ నూతన జెర్సీని సామాజిక మాధ్యమం ద్వారా దిల్లీ విడుదల చేసింది. కొత్త జెర్సీలను కొంతమంది అభిమానులకు పంపిణీ చేసింది. దిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన కార్యక్రమంలో నూతన జెర్సీలతో ఫ్యాన్స్‌ ఫొటోలకు పోజులిచ్చారు. ఈ చిత్రాలను దిల్లీ క్యాపిటిల్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. 

‘‘ఐపీఎల్‌ సీజన్‌ మ్యాచ్‌ల కోసం ఎదురు చూస్తున్నాం. మా కొత్త జెర్సీలో ఆటగాళ్లను వీక్షించేందుకు వేచి ఉండలేకపోతున్నాం. డీసీకి అభిమానుల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అందుకే మా ప్రయాణంలో వారిని భాగం చేసుకోవడం బాధ్యత’’ అని దిల్లీ క్యాపిటల్స్‌ తాత్కాలిక సీఈవో వినోద్ బిస్త్ వెల్లడించారు. దిల్లీ క్యాపిటల్స్ తన మొదటి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ను మార్చి 27న ఢీకొట్టనుంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని