WPL: అర్ధ శతకంతో మెరిసిన పెర్రీ.. దిల్లీ క్యాపిటల్స్‌ లక్ష్యం ఎంతంటే?

డబ్ల్యూపీఎల్‌ (WPL)లో దిల్లీ క్యాపిట్సల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌ ముగిసింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.

Published : 13 Mar 2023 21:03 IST

ముంబయి: డబ్ల్యూపీఎల్‌ (WPL)లో దిల్లీ క్యాపిట్సల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌ ముగిసింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఎల్లీస్‌ పెర్రీ (67; 52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ శతకంతో మెరవగా.. రిచా ఘోష్‌ (37; 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడింది.  కెప్టెన్‌ స్మృతి మంధాన (8), హెథర్‌ నైట్‌ (11) నిరాశపర్చగా..  సోఫీ డివైన్‌ (21) ఫర్వాలేదనిపించింది. శ్రేయంకా పాటిల్‌ (4*)  పరుగులు చేసింది. దిల్లీ బౌలర్లలో శిఖా పాండే మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. తారా నోరిస్ ఒక వికెట్‌ను ఖాతాలో వేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని